గ్రామ పెద్దల కారణంగా అత్యాచారానికి గురైన గర్భిణీ
పాకిస్థాన్ :గ్రామాల్లో పెద్దరాయుళ్ళ తీర్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద రాయుళ్ళు తమ ఇష్టారీతిలో తీర్పులు ఇస్తుంటారు. ఈ తీర్పులు ఓ వివాహిత ఆత్మహాత్యకు కారణమైంది. సమాజం తలదించుకొన విధంగా పెద్ద రాయుళ్ళు తీర్పులు చెప్పారు. ఈ ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకొంది.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ పరిధిలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకొంది. పంజాబ్ ప్రావిన్స్ లోని గుజరాత్ సిటీ చెందిన ఓ మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం జరిపాడు. బాలిక కుటుంబసభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించారు.అయితే గ్రామపెద్దలు తప్పుడు పద్దతిలో తీర్పును చెప్పారు . ఈ తీర్పు ఓ వివాహిత ప్రాణాలను తీసుకొనేలా చేసింది.
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి కూతురును రేప్ చేయాలని గ్రామపెద్దలు మరో వ్యక్తిని ఆదేశించారు. తప్పు చేసింది ఒకరు , కాని శిక్షను మరోకరు అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరైతే నిందితుడో అతని కూతురికి అప్పటికే వివాహమైంది. ఆమె నిండు గర్భిణీ. గర్భిణీ అని తెలిసి కూడ ఆమెపై గ్రామపెద్దలు అత్యాచారం జరపాలని ఆదేశించారు.
గ్రామపెద్దల తీర్పుకు అనుగుణంగా ఓ వ్యక్తి గర్భవతిపై అత్యాచారం చేశాడు. దీంతో అవమానం తట్టుకోలేక గర్భీణీ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేసింది. కుటుంబసభ్యులు ఆమెను లాహోర్ ఆసుపత్రికి తరలించారు. ఆసపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. తనకు జరిగిన అవమానాన్ని భాదితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.