నూతన అమెరికా కోసం ఓటు వేయండి: ఒబామాతో కలిసి జో బైడెన్ పిలుపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అమెరికా ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వీరు పిలుపునిచ్చారు.
నూతన అమెరికా కోసం ప్రతి అమెరికన్ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అంతేగాక, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒమాతో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. 'బరాక్ ఒబామా నేతృత్వంలో 2008, 2012 ఎన్నికల్లో దేశాన్ని ముందుండి నడిపించంలో మీరు నాపై నమ్మకం ఉంచారు. ప్రస్తుతం నేను, కమలా హారీస్ కలిసి పోటీ చేస్తున్నందున.. మాపై మరోసారి విశ్వాసం ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని జో బైడెన్ వ్యాఖ్యానించారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, ప్రజల మన్ననలను చూరగొంటామని అని బైడెన్ అన్నారు. ప్రజలను నిరాశపర్చమని హామీ ఇస్తున్నామని జో బైడెన్ స్పష్టం చేశారు. కొత్త అమెరికాను తీర్చిదిద్దుతామని అన్నారు.
In 2008 and 2012, you placed your trust in me to help lead this country alongside Barack Obama.
— Joe Biden (@JoeBiden) November 3, 2020
Today, I’m asking for your trust once again — this time, in Kamala and me.
We can heal the soul of this nation — I promise we won’t let you down.https://t.co/eoxT07uII9 pic.twitter.com/VwZkmZ53F4
కాగా, అమెరికా ఎన్నికలు ఇప్పటికే ప్రారంభం కాగా, ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ముందస్తు ఓటింగ్లో ఇప్పటికే దాదాపు 10 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, నవంబర్ 3న మరో 6 కోట్ల మంది ఓటు వేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
Today, vote for a new day in America. pic.twitter.com/WzarlQ8JDI
— Joe Biden (@JoeBiden) November 3, 2020
ప్రీపోల్స్ సర్వేలో జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో కొనసాగుతున్నట్లు చెబుతున్నాయి. అయితే, గతంలో బైడెన్ కంటే.. చాలా వెనుకబడి ఉన్న ట్రంప్.. గత కొద్ది రోజుల్లోనే బాగా పుంజుకున్నారు. అయినా బైడెన్ స్వల్ప ఆధిక్యతను చూపుతున్నారని తెలిపాయి. అయితే, ఎన్నికల ఫలితాలు వచ్చినతర్వాతే అసలు విజయం ఎవరిదనేది తేలనుంది.