అమెరికా ద్వంద్వ నీతి?: యుద్దం బూచితో ఆ దేశం ఏం చేస్తుందో తెలుసా?

ఉత్తరకొరియా-అమెరికా మధ్య యుద్దం ముంచుకొస్తే.. ఆ ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడే అవకాశం ఉడటంతో.. అమెరికా మిత్ర దేశాలన్ని ఆయుధాల కొనుగోళ్లలో తలమునకలయ్యాయి.

వాషింగ్టన్: ఉత్తరకొరియాపై ట్రంప్ హెచ్చరికలతో స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోతున్నాయని అమెరికా కంపెనీలు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు ఆయుధాల కొనుగోళ్లు మాత్రం ఊపందుకున్నాయని ఆ దేశ వర్గాలు చెబుతున్నాయి. ఒకవిధంగా ఈ ప్రయోజనం కోసమే ట్రంప్.. ఉత్తరకొరియాను హెచ్చరించారన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

ఉత్తరకొరియా-అమెరికా మధ్య యుద్దం ముంచుకొస్తే.. ఆ ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడే అవకాశం ఉడటంతో.. అమెరికా మిత్ర దేశాలన్ని ఆయుధాల కొనుగోళ్లలో తలమునకలయ్యాయి. ఈవిధంగా అమెరికా ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది.

weapon sales increased in america after trump warning to north korea

అమెరికా ఆయుధ కంపెనీలకు లాభం చేకూర్చడం కోసమే 'యుద్దానికి సిద్దం' అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారని కొంతమంది పరిశీలకులు చెబుతున్నారు. అదే నిజమైతే.. యుద్దం బూచి చూపి అమెరికా ద్వంద్వ నీతికి పాల్పడుతున్నట్లే. గతంలో సిరియాపై క్షిపణులు దాడి సమయంలోను ఆయుధాల అమ్మకాలు పెరిగాయని కంపెనీలు వెల్లడించాయి.

అణ్వాయుధాలు ఉన్నాయంటూ గతంలో పలు దేశాలపై దాడి చేసిన అమెరికా.. తన విషయంలో మాత్రం దాన్ని పట్టించుకోకపోవడం ఆ దేశ వైఖరిని బయటపెడుతోంది. ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే.. ఆయుధ విక్రయాల కోసం ద్వంద్వ నీతిని అవలంభించడం అమెరికాకే చెల్లుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+