అమెరికా ద్వంద్వ నీతి?: యుద్దం బూచితో ఆ దేశం ఏం చేస్తుందో తెలుసా?
ఉత్తరకొరియా-అమెరికా మధ్య యుద్దం ముంచుకొస్తే.. ఆ ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడే అవకాశం ఉడటంతో.. అమెరికా మిత్ర దేశాలన్ని ఆయుధాల కొనుగోళ్లలో తలమునకలయ్యాయి.
వాషింగ్టన్: ఉత్తరకొరియాపై ట్రంప్ హెచ్చరికలతో స్టాక్ మార్కెట్లు కుప్ప కూలిపోతున్నాయని అమెరికా కంపెనీలు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు ఆయుధాల కొనుగోళ్లు మాత్రం ఊపందుకున్నాయని ఆ దేశ వర్గాలు చెబుతున్నాయి. ఒకవిధంగా ఈ ప్రయోజనం కోసమే ట్రంప్.. ఉత్తరకొరియాను హెచ్చరించారన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
ఉత్తరకొరియా-అమెరికా మధ్య యుద్దం ముంచుకొస్తే.. ఆ ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడే అవకాశం ఉడటంతో.. అమెరికా మిత్ర దేశాలన్ని ఆయుధాల కొనుగోళ్లలో తలమునకలయ్యాయి. ఈవిధంగా అమెరికా ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికా ఆయుధ కంపెనీలకు లాభం చేకూర్చడం కోసమే 'యుద్దానికి సిద్దం' అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారని కొంతమంది పరిశీలకులు చెబుతున్నారు. అదే నిజమైతే.. యుద్దం బూచి చూపి అమెరికా ద్వంద్వ నీతికి పాల్పడుతున్నట్లే. గతంలో సిరియాపై క్షిపణులు దాడి సమయంలోను ఆయుధాల అమ్మకాలు పెరిగాయని కంపెనీలు వెల్లడించాయి.
అణ్వాయుధాలు ఉన్నాయంటూ గతంలో పలు దేశాలపై దాడి చేసిన అమెరికా.. తన విషయంలో మాత్రం దాన్ని పట్టించుకోకపోవడం ఆ దేశ వైఖరిని బయటపెడుతోంది. ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే.. ఆయుధ విక్రయాల కోసం ద్వంద్వ నీతిని అవలంభించడం అమెరికాకే చెల్లుతోంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications