Modi-Biden Meet : మోడీకి బైడెన్ క్లాస్ పీకడం లేదట- వైట్ హౌస్ కీలక ప్రకటన..
ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల యూఎస్ పర్యటన ఇవాళ ప్రారంభమైంది. ఉదయం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తో భేటీ అయిన ప్రధాని మోడీ.. అనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కానున్న ప్రధాని మోడీ పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. అయితే ఇందులో ఓ కీలక అంశంపై జో బైడెన్ ఈసారి ప్రధాని మోడీని ఇబ్బంది పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది.
భారత్ లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఈ మధ్య అమెరికా పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అమెరికాతో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు మోడీ సర్కార్ ఎదురుదాడి చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు అమెరికా పర్యటనలో అధ్యక్షుడు జో బైడెన్ ఇదే అంశాన్ని నేరుగా ప్రస్తావిస్తే ఏం సమాధానం చెప్పాలనే విషయంలో మోడీ కసరత్తు చేసి మరీ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు అంత అవసరం రాకపోవచ్చని తెలిసింది.

యూఎస్ లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి జో బైడెన్ స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన తన దేశానకి ప్రపంచ వేదికపై ప్రభావాన్ని పెంచడానికి మోడీ ప్రయత్నాలు చేస్తుండగా..చైనాకు భారతదేశం వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా ఉండాలని వాషింగ్టన్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో మోడీ టూర్ లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వివిధ ఒప్పందాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో రక్షణ సహకారం, విక్రయాలు, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, మైక్రోన్ టెక్నాలజీ, ఇతర యూఎస్ కంపెనీల ద్వారా భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించినవి ఉన్నాయి.
అయితే భారతదేశంలో ప్రజాస్వామ్య వెనుకబాటుతనం గురించి మాత్రం అమెరికా ఆందోళనలను బైడెన్ ప్రస్తావించే అవకాశం ఉందని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు. అయితే మానవ హక్కుల అంశంపై మోడీకి ఉపన్యాసాలు మాత్రం ఇవ్పుబోరని సుల్లివన్ వెల్లడించారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications