1947లో బ్రిటిషర్స్ ఎందుకెళ్లిపోయారంటే.. (వీడియో)
ఢిల్లీ: 1947లో ఎందుకు వదిలి వెళ్లారనే విషయమై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1945లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న సమయంలో బ్రిటిషర్లు భారత్కు స్వాతంత్య్రం ప్రకటించడం వెనుక పెద్ద కారణముందని దోవల్ చెబుతున్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నాడు అతివాదిగా ముద్రపడి దేశం వదిలి వెళ్లిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యూహాలకు సతమతమైన కారణంగానే బ్రిటిషర్లు భారత్ నుంచి వెళ్లిపోయారని చెప్పారు.

నాడు నేతాజీ స్వయంగా భారత సైన్యంలో రేపిన చిచ్చుకు భయపడి బ్రిటిషర్లు వెళ్లిపోయారన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన బ్రిటిషర్లు రెట్టించిన ఉత్సాహంతో భారత్లో పాలన చేయాల్సింది పోయి, ఎలాంటి పెద్ద కారణం లేకుండా వెళ్లిపోవడానికి కారణంగా నేతాజీయేనని పేర్కొన్నారు.
దోవల్ ప్రసంగానికి సంబంధించి ఆరు నిమిషాల నిడివి ఉన్న వీడియో యూట్యూబ్లో హల్ చల్ చేస్తోంది. 1945 ఆగస్టు 18న తైవాన్ వెళ్తుండగా విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయిననట్లు 1945 ఆగస్టు 18న టోక్యో రేడియో ప్రకటించింది. అయితే, నేతాజీ మద్దతుదారులు దానిని కొట్టిపారేశారు.
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications