Wife: బాత్ రూమ్ లో భార్యను, బెడ్ రూమ్ లో కూతుర్లను చంపేశాడు, హాల్ లోకి వచ్చి ఏం చేశాడంటే ?
కరాచి/ఇస్లామాబాద్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ కంపెనీలో భర్త ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ఇంటిలో ఉంటున్నది. కుమార్తెలు ముగ్గురు చదువుకుంటున్నారు. ఇటీవల దంపతుల మద్య గడొవలు ఎక్కువ అయ్యాయి. రానురాను దంపతుల గొడవలు తారాస్థాయికి చేరాయి. పెద్దలు పంచాయితీలు చేసినా దంపతుల మద్య గొడవలు సర్దుమనగలేదు. చివరికి భర్త అతని భార్యను గొంతు చీల్చి దారుణంగా చంపేశాడు. భార్యను హత్య చేసిన తరువాత ముగ్గురు కుమార్తెలను దారుణంగా హత్య చేశాడు.
ముగ్గురు కుమార్తెలు
పాకిస్తాన్ లోని కరాచీలోని షమ్సీ సోసైటీలో ఫహాద్ ఖాన్ అలియాస్ ఫహాద్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 18 సంవత్సరాల క్రితం రజియా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళను ఫహాద్ వివాహం చేసుకున్నాడు. రజియాకు ప్రస్తుతం 38 సంవత్సరాలు. రజియా, ఫహాద్ దంపతులకు 16 ఏళ్లు, 12 ఏళ్లు, 10 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కంపెనీలో భర్త ఉద్యోగం
పాకిస్తాన్ లో చాలా ఫేమస్ అయిన మసాలా పొడులు తయారు చేసి విక్రయించే కంపెనీలో హఫ్తాద్ ఉద్యోగం చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో హఫ్తాద్ ఉద్యోగం చేస్తూ అతని భార్య రజియా, ముగ్గురు కుమార్తెలను పోషిస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం హఫ్తాబ్ అతని భార్య రజియాతో గొడవపడటం మొదలుపెట్టాడు.
భార్యను బాత్ రూమ్ లో..... పిల్లలను బెడ్ రూమ్ లో చంపేసి ?
ఇటీవల హఫ్తాబ్, రజియా దంపతుల మద్య గడొవలు ఎక్కువ అయ్యాయి. రానురాను హఫ్తాబ్, రజియా దంపతుల గొడవలు తారాస్థాయికి చేరాయి. పెద్దలు పంచాయితీలు చేసినా రజియా, హఫ్తాబ్ దంపతుల మద్య గొడవలు సర్దుమనగలేదు. చివరికి హఫ్తాబ్ అతని భార్య రజియాను బాత్ రూమ్ లో పదునైన ఆయుధంతో ఆమె గొంతు చీల్చి దారుణంగా చంపేశాడు. భార్య రజియాను హత్య చేసిన తరువాత హఫ్తాబ్ అతని ఇంటిలోని బెడ్ రూమ్ లో నిద్రపోతున్న ముగ్గురు కుమార్తెలను అదే ఆయుధంతో దారుణంగా హత్య చేశాడు.
ఏం జరిగింది ?
భార్య, పిల్లలను హత్య చేసిన తరవుాత హఫ్తాబ్ ఆత్మహత్యాయత్నం చేశాడని కరాచి సీనియర్ పోలీసు అధికారి కొరంగి సాజిద్ జదోజాయ్ స్థానిక మీడియాకు చెప్పారు. తీవ్రగాయాలైన హఫ్తాబ్ ఆసుపత్రిలో ఉన్నాడని, కేసు విచారణలో ఉందని కరాచి సీనియర్ పోలీసు అధికారి కొరంగి సాజిద్ జదోజాయ్ అన్నారని పాకిస్తాన్ మీడియా తెలిపింది.