ఐసిస్ ఘాతుకం: లాటరీ వేసి అత్యాచారం, తర్వాత కామాంధులకు వేలం
సిరియా: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల దారుణాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. యాజిది వర్గం వారు ఐసిస్ ఉగ్రవాదుల ఘాతుకాలను వెల్లడించారు. ఐసిస్ ఉగ్రవాదులు మహిళలను, యువతులను తీసుకెళ్లి, లాటరీ పద్ధతిలో అత్యాచారానికి పాల్పడేవారని వెల్లడించారు.
ఐసిస్ ఉగ్రవాదులు అత్యాచారం చేసిన వారలో ఎనిమిదేళ్ల నుండి పన్నెండేళ్ల వయస్సు బాలికలు కూడా ఉన్నారు. తాము అత్యాచారానికి పాల్పడిన అనంతరం అందులో కొందరిని గ్రామంలోని ఇతర కామాంధులకు వేలం వేశారని ఐసిస్ ఉగ్రవాదుల నుండి తప్పించుకున్న కొందరు చెబుతున్నారు.
ఓ పన్నెండేళ్ల బాలికను కట్టేసి, చితక్కొట్టి ఐడుగురు ఐసిస్ ఉగ్రవాదులు వంతుల వారీగా అత్యాచారానికి పాల్పడ్డారు.
తనతో పాటు కొంతమంది పిల్లలం ఉన్నామని, తాము ఉన్న గదిలోకి ఐసిస్ ఫైటర్లు వచ్చారని, వారు చెప్పినట్టు చేయక పోవడంతో కొట్టారని, స్నానం చేసేందుకు ఒప్పించామని, ఆ గదిలో యాసిడ్ డబ్బా కనిపించడంతో.. ఆత్మహత్య చేసుకుందామనుకున్నామని, అయితే, అది తాగినప్పటికీ తామెవరం చనిపోలేదని ఓ బాలిక చెప్పింది.
అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐసిస్ ఉగ్రవాదులు వదలలేదని, పలుమార్లు అత్యాచారం చేశారని చెప్పారు. కాగా, బాధిత బాలికల విషయాలను హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వెల్లడించింది. బాలికలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారని వెల్లడించారు.