జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Viral News: ఆర్టీసీ బస్సును ఆపిన రూ.500 నోటు.. ఎలాగంటే..

|
Google Oneindia TeluguNews

మనం రూపాయి పోయినా దాని కోసం వెతుకుతుంటాం. అలాంటి ఐదు వందల రూపాయి నోటు పోతే.. అది జరిగింది ఓ చోట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్తోంది. బస్సు ప్రారంభ కాగానే కండక్టర్ టికెట్లు తీసుకోవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బస్సులోని ప్రయాణికులందరికీ టికెట్లు ఇస్తున్నాడు.

బయటకు

బయటకు

బస్సు నడుస్తుండడంతో బయట నుంచి గాలి వేగంగా వస్తోంది. ఇంతలో ఓ ప్రయాణికురాలికి టిక్కెట్ ఇస్తుండగా.. కండక్టర్ చేతిలోంచి రూ.500 నోటు గాల్లోకి ఎగిరిపోయింది. దాన్ని పట్టుకోవడానికి కండక్టర్ ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆ నోటు బస్సు కిటికీ నుంచి గాల్లోకి ఎగురుతూ బయటకు కొట్టుకెళ్లింది. దీంతో కండక్టర్ తో పాటు ప్రయాణికురాలు కంగారు పడి కేకలు వేశారు. దీంతో డ్రైవర్ ఏం జరిగిందో తెలియ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు.

8 నిమిషాల పాటు

8 నిమిషాల పాటు


వెంటనే డ్రైవర్ తో పాటు కొందరు ప్రయాణికులు కూడా కిందకు దిగి నోటు కోసం ఎంకులాడడం మొదలు పెట్టారు. దాదాపు 8 నిమిషాల పాటు రూ.500 నోటు కోసం చెట్ల పొదల్లో వెతికాగా.. చివరకు ఆ రూ.500 నోటు ఓ ప్రయాణికుడికి దొరికింది. దీంతో అందరు ఊపిరిపీల్చుకున్నాడు. వారంతా నవ్వుతూ బస్సు ఎక్కారు. దేవుడి దయతో నా 500 రూపాయలు దొరికాయి అంటూ సదరు ప్రయాణికురాలు సంతోషపడింది.

జోకులు

జోకులు


ఈ ఘటనపై బస్సులో ప్రయాణికులు తలో జోకు వేసుకుంటూ నవ్వుకుంటూ జగిత్యాల వెళ్లారు. నోటు సరిగా పట్టుకోలేదు కాబట్టే గాల్లో ఎగిరిపోయిందని ఒకరు.. లేదు గాలి బాగా వచ్చిందని మరొకరు మాట్లాడుకున్నారు.

English summary
An interesting incident happened in Dharmapuri of Jagityala district. Now this news is going viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X