ఏపీ రాజకీయాలపై కేటీఆర్: ఒరిజినల్ కాంగ్రెస్- జగన్కు లింక్
జగిత్యాల్: అధికార భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టారు. తెలంగాణలో ఇప్పుడున్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదని సెటైర్లు సంధించారు.
ఏపీ రాజకీయాలపై కేటీఆర్: ఒరిజినల్ కాంగ్రెస్- జగన్కు లింక్#Telangana,#BRS, #KTR pic.twitter.com/DqVFyxLgCB
— oneindiatelugu (@oneindiatelugu) July 16, 2023
ఇవ్వాళ ఆయన జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జగిత్యాలకు చెందిన బీఆర్ఎస్ శాసన సభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటికి వెళ్లారు. అక్కడే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు ఎకరాల పొలం ఉన్న రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ ఇదివరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. వ్యవసాయం, రైతాంగం పట్ల ఆయనకు ఉన్న బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలతో లక్షలాది మంది రైతులను అవమానించారని చెప్పారు. తమ పాలనలో రైతులను రాజుగా చేశామని, ఇక ముందు కూడా రైతాంగ అనుకూల విధానాలను కొనసాగిస్తామని అన్నారు.
తమ పాలనను మహారాష్ట్ర రైతులు సైతం ప్రశంసిస్తోన్నారని, తమ విధానాలను అక్కడ కూడా అమలు చేయాలనే బలమైన ఆకాంక్షలను వారు వ్యక్తం చేస్తోన్నారని కేటీఆర్ చెప్పారు. రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్నది నకిలీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది ఒరిజినల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని కేటీఆర్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నడిచే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడుస్తోందని ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి ఉచిత విద్యుత్ను ఇచ్చిన మాట వాస్తవం అని కేటీఆర్ చెప్పారు.
అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు లేదని అన్నారు. ఇప్పుడున్నది వైఎస్సార్ కాంగ్రెస్ కాదని, చంద్రబాబు కాంగ్రెస్ అని తేల్చి చెప్పారు. వైఎస్సార్ అనుసరించిన విధానాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఏ మాత్రం లేవని కేటీఆర్ పేర్కొన్నారు. ఒరిజినల్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఏపీకి తీసుకెళ్లారని- అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా మనుగడలో ఉందని అన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications