ప్రొద్దుటూరులో 300 కిలోల బంగారం సీజ్: దసరా వేళ ఇలా జరిగిందేంటి?
కడప: వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారులకు భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. ప్రొద్దుటూరులోని నాలుగు బంగారం దుకాణాల్లోబిల్లులు లేని సుమారు 300 కిలోల బంగారాన్ని ఐటీ అధికారులు అధికారులు సీజ్ చేశారు. విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ అధికారులు గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెల్లర్స్, డైమండ్స్ షాపులతోటు గురురాఘవేంద్ర, తల్లం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు.
సీజ్ చేసిన బంగారాన్ని అట్టపెట్టులు, సూట్ కేసుల్లో భద్రపరిచి వాహనాల్లో తిరుపతికి తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా భారీ మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఐటీ అధికారులు గుర్తించి ఈ తనిఖీలు నిర్వహించారు.

బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబైగా పేరు పొందింది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు నాలుగు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరులో రెండు వేలకుపైగా బంగారం, స్వర్ణకారుల దుకాణలున్నాయి.
తాజా ఐటీ అధికారుల తనిఖీలతో మిగితా బంగారం దుకాణాల యజమానుల్లో వణుకు మొదలైంది. తనిఖీలు తమ వరకు రావచ్చన్న ఆందోళనతో బంగారం, స్వర్ణకారులు దుకాణాలను మూసివేశారు. దసరా పండగ సమయంలో బంగారం దుకాణాలు మూసి ఉండటంతో కొనుగోలుదారులు దుకాణాల వద్దకు వచ్చి తిరిగి నిరాశగా వెళుతున్నారు.
-
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications