భర్త, భార్య.. ప్రేయసి.. రెడ్హ్యాండెడ్గా పట్టుకొని, డిష్యూం, డిష్యూం..
అతనికి పెళ్లయ్యింది. కూతురు పెళ్లికి ఎదిగింది. కుమారుడు ఉన్నాడు.. కానీ చెడు వ్యసనాలు మారలే.. బరువు లేదు.. బాధ్యత అంతకన్నా లేదు. ఈ మొగుడు వద్దు అని ఆమె అనుకుంది. డబ్బుల కోసం వేధించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంకేముంది అతను తనలో గల మరో బుద్దిన బయటపెట్టాడు. వివాహితను తీసుకొచ్చి ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు. విషయం తెలిసిన భార్య.. మళ్లీ వచ్చింది. కుమారుడు, కూతురుతో కలిసి రచ్చ రచ్చ చేసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన వాయినీల రాజేశం విజయకు 25 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వీరికి పెండ్లికి ఎదిగిన కూతురు - కుమారుడు ఉన్నారు... వ్యసనాలకు బానిసైన రాజేశం ..భార్య విజయను డబ్బులకోసం వేధింపులకు గురిచేసేవాడు. కొట్టి ఇంట్లోంచి తరిమివేశాడు. విజయ పుట్టింటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన రాజేశం ఏకంగా మహారాష్ట్రకు చెందిన రజిత అనే మరో వివాహితను తెచ్చుకొని ఇంట్లోనే కాపురం పెట్టాడు.
విషయం తెలుసుకున్న విజయ కాల్వశ్రీరాంపూర్కు చేరుకుంది. ఆ యువతి, రాజేశంను చితకబాదింది. వారికి స్థానిక మహిళలు సపోర్ట్ చేశారు. ఈ ఘటన అంతా సీరియల్ను తలపించింది. దాడులు, కేకలతో మిన్నంటింది. దీనికి సంబంధించి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆ తర్వాత విజయ కాల్వశ్రీరాంపూర్ పోలీసులకు పిర్యాదు చేసింది.
Recommended Video
పెళ్లీడుకొచ్చిన కూతురును ఇంట్లో పెట్టుకుని.. మరో వివాహితతో రాజేశం కులికాడు. కడుపు రగిలిన భార్య.. వచ్చి దాడి చేసింది. తన జీవితంలో నిప్పులు పోశావని విలపించింది. అక్కడున్న స్థానికులు కూడా విజయకు సపోర్ట్ చేశారు. మద్దతుగా ఉండి.. రాజేశం, రజితను నిలువరించారు.