నేను ఉన్నాను.. ఎక్కడికీ వెళ్లలేదు.. వామనరావు మర్టర్ కేసుపై పుట్ట మధు
న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని తెలిపారు. అడ్వకేట్ దంపతుల కేసు విచారణ పూర్తయ్యాక హైదరాబాద్లో ప్రెస్మీట్ పెడుతానని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లలేదని, వారిని అపాయింట్మెంట్ అడగలేదని తెలిపారు.

బీసీ జడ్పీ చైర్మన్ అయితే... మరీ ఇలానా..
ఒక బీసీ జెడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నారని పుట్ట మధు తప్పుబట్టారు. పోలీసులను విచారణ చేయనిస్తారా.. లేక ఎమ్మెల్యే శ్రీధర్బాబు చేస్తారా? అని పుట్ట మధు ప్రశ్నించారు. కొందరు మీడియా ప్రతినిధులకు పుట్ట మధు సూటి ప్రశ్నలు వేశారు. తన వద్ద డబ్బులు లేకుంటే మమ్మల్ని బదనాం చేశారని మండిపడ్డారు. శ్రీధర్బాబు కోట్ల రూపాయల ఇస్తూ హైదరాబాద్లో మీడియాను మేనేజ్ చేస్తే తనకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారని పైరయ్యారు.

శ్రీధర్ బాబుకు మద్దతుగా కథనాలు
అందులో శ్రీధర్ బాబుకు మద్దతుగా కథనాలను రాయిస్తున్నారని తెలిపారు. మీడియా రేటింగ్ల కోసం తనకు అన్యాయం చేస్తారా అని పుట్ట మధు ప్రశ్నించారు. లాయర్ దంపతుల హత్య కేసులో సూత్రదారి పుట్ట మధు అని ప్రచారం జరుగుతోంది. స్థానిక రాజకీయాల నుంచి వచ్చిన మధు.. లోకల్ పాలిటిక్స్లో పట్టు సాధించేందుకు అడ్డు వస్తున్న వారిపై సామదాన దండోపాయ విద్యను పాటించేందుకు వెనుకాడడనే చర్చ జోరుగా సాగుతోంది. న్యాయవాదుల హత్య.. పుట్టా మధు రాజకీయ జీవితంపై మచ్చ పడేలా చేసింది.

సీఐడీకి వామనరావు మర్డర్ కేసు..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంచలన కేసుల దర్యాప్తును సీఐడీకి బదిలీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు, బోధన్ స్కాం.. ఇలా తీవ్రత ఎక్కువగా ఉన్న కేసులన్నీ సీఐడీకి అప్పగించారు. ఇప్పుడు వామన్ రావు దంపతులు హత్య కేసును కూడా సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికితోడు టీఆర్ఎస్ నేతపై ఏ-1గా ఉండటంతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. వాస్తవానికి అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. టీఆర్ఎస్ నేతగానే అంటారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications