పుట్ట మధు ఇష్యూతో ప్రభుత్వానికి సంబంధం లేదు: గంగుల కమలాకర్
ఈటల రాజేందర్ ఇష్యూతో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. అయితే అనుచరులపై టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. ముఖ్యంగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుపై దృష్టిసారించింది. ఈటలతో గల లావాదేవీలతో పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లగా.. ఏపీలో ఆచూకీ లభించిన సంగతి తెలిసిందే. అంతేకాదు పుట్టమధును జెడ్పీ చైర్మన్ పదవీ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో స్థానిక మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.
పుట్ట మధు ఇష్యూతో ప్రభుత్వానికి సంబంధం లేదని కమలాకర్ చెప్పారు. కానీ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. ఇవాళ ఆయన హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. పుట్ట మధు వ్యవహారంతో సర్కార్కు సంబంధం లేదని హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు హస్తానికి సంబంధించిన కూపీని పోలీసులు లాగుతున్నారు. ఈ క్రమంలో కమలాకర్ రియాక్టయ్యారు.

హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది అని చెప్పారు. ఇక్కడ ఎవరూ గెలిచిన అదీ కేసీఆర్ క్రెడిట్ అని చెప్పారు. ఈటల రాజేందర్, గంగుల కమలాకర్కు కేసీఆర్ను చూసే ఓటు వేశారని తెలిపారు. కారు గుర్తు, కేసీఆర్ భొమ్మ ఇంపార్టెంట్ అని చెప్పారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అందరికీ అండగా తాము ఉంటామని చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications