టీఆర్ఎస్ అభ్యర్థికి ఘోర పరాభవం, ప్రచారానికి వెళ్తే చెప్పులతో తరిమికొట్టిన జనం (వీడియో)
అశ్వారావుపేట: ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి శుక్రవారం ఘోర పరాభవం ఎదురైంది. ఓ గ్రామంలో గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని, ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్న వారిని చెప్పులతో వెంబడించారు. వారిని తరిమి తరిమి కొట్టారు.
అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, ఆయన మద్దతుదారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బంజారా గిరిజనులు ఆయనకు చెప్పులతో నిరసన తెలిపారు. ఆయన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్ద ఎత్తున వాహనాలతో అభ్యర్థి ప్రచారం కోసం వచ్చారు. కానీ ఘోర పరాభవం ఎదురైంది.
తాటి వెంకటేశ్వర్లు పైన ఆ గ్రామస్తులు చూపిన ఆగ్రహంతో కాళ్లకు బుద్ధి చెప్పాల్సినంత పని అయింది. ఇన్నేళ్ల పాటు ఎక్కడున్నావని, ఎన్నికల సమయంలో ఇప్పుడు వస్తున్నావా, ఎప్పుడైనా తమ గ్రామానికి వచ్చి, సమస్యలు అడిగావా అని వారు రాయలేని విధంగా తిట్లు తిట్టారు.

నీకు ఇప్పుడు ఎన్నికలు వచ్చాక మేం కనిపించామా అని ప్రశ్నించారు. ఈ గ్రామంలో ఏ కొంతమందో అతనికి వ్యతిరేకంగా చెప్పులతో నిరసన తెలిపినట్లుగా లేదు. అది లంబాడీ తండ. ఆ తండాలోని గిరిజనులు అందరూ అతనికి వ్యతిరేకంగా బయటకు వచ్చారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని తండావాసులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు.
-
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications