Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికల వేళ.. కుప్పంపై కేంద్రం వరాలు

Amrit Bharat Stations: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రైలు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి తక్షణ చర్యలు చేపట్టింది. ఏపీ, కర్ణాటకల్లో మొత్తం 15 రైల్వేస్టేషన్లను ఎంపిక చేసింది.

అత్యంత రద్దీగా ఉండే బెంగళూరు డివిజన్‌ పరిధిలోకి వచ్చే రైల్వే స్టేషన్లు అవన్నీ. చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం స్టేషన్లు కూడా ఈ డివిజన్‌ కిందికే వస్తాయి. వాటిన్నింటినీ 372.13 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనుంది రైల్వే మంత్రిత్వ శాఖ.

15 stations including kuppam and hindupur selected for the redevelopement under the amrit stations

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఈ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే.. కొత్తగా నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్ అండర్ బ్రిడ్జీలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ.. బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తోన్న నైరుతి రైల్వే అధికారులు పూర్తి చేస్తోన్నారు.

బెంగళూరు డివిజన్ పరిధిలోకి వచ్చే బంగార్‌పేట, చెన్నపట్టణ, ధర్మపురి, దొడ్డబళ్లాపుర, హిందూపురం, హోసూరు, కెంగేరి, కృష్ణరాజపురం, కుప్పం, మల్లేశ్వరం, మాలూరు, మండ్య, రామనగర, తుంకూరు, వైట్ ఫీల్డ్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ కింద అభివృద్ధి చేయనుంది.

చెన్నపట్టణ-శెట్టిహళ్లి, చిన్నకొత్తపల్లి-మక్కాజీ పల్లి-నాగసముద్రం స్టేషన్ల మధ్య నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి, బెంగళూరు ఈస్ట్ స్టేషన్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జిని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఈ మేరకు నైరుతి రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+