ఇదే చివరి ఎన్నిక: పత్తికొండ టూర్లో చంద్రబాబు హాట్ కామెంట్స్
ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల మూడ్ వచ్చేసింది. కొందరు నేతలు తమ సేఫ్ ప్లేస్ చూసుకుంటున్నారు. అవసరమైతే పార్టీని మారుస్తున్నారు. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు వెళుతున్నారు. మాజీ సీఎం, ప్రస్తుత ఏపీ ప్రతిపక్ష నేత బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సీనియర్ నేత అయినా తనకు తగిన గౌరవం దక్కలేదని తెలిపారు. తనను, తన భార్యను కూడా అవమానించారని గుర్తుచేశారు. ఇదీ గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి బయటకొచ్చానని గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా మారుస్తామని తెలిపారు.
తమను గెలిపించాల్సిన బాధ్యత మీదేనని అన్నారు. గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఓకే.. లేదంటే ఇదే తనకు చివరి ఎన్నిక అవుతుందని స్పష్టంచేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని హింట్ ఇచ్చారు. వయస్సు పై బడటంతో.. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సి ఉంది. కానీ ఆయన జనాలతో చెప్పి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకుంటే.. లోకేశ్ నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. అయితే అతని వల్ల అవుతుందా.. లేదా అనే సందేహాం వ్యక్తం కావడం సహాజమే. చూడాలీ మరీ ఏం జరుగుతుందోనని.












Click it and Unblock the Notifications