కోటి 12 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్ .. తహసీల్దార్ నాగరాజు తరహాలోనే
తెలంగాణ రాష్ట్రంలో లంచావతారాలు పెరిగిపోతున్నారు . మొన్నటికి మొన్న కీసర తహసిల్దార్ గా పనిచేసిన నాగరాజు భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన మరిచిపోకముందే నేడు మరో ఉన్నతాధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పట్టుబడడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.

112 ఎకరాల భూమికి సంబంధించి ఎన్వోసీ కోసం ఒక కోటి 40 లక్షల రూపాయల డిమాండ్
కీసర
తహసిల్దార్ గా పనిచేసిన నాగరాజు లంచం తీసుకున్న ఘటన మరిచిపోకముందే మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ కోటి 12 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కారు. నర్సాపూర్ డివిజన్ లోని తిప్పల్ తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి సంబంధించి ఎన్వోసీ కోసం ఒక కోటి 40 లక్షల రూపాయలను డిమాండ్ చేసిన నగేష్, అందులో కోటి 12 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

కోటి 12 లక్షల నగదు, కోటి రూపాయల ప్రాపర్టీ కూడా .. ఏసీబీకి ఆధారాలతో అడ్డంగా దొరికి
భూమి వివాదం పరిష్కరించడం కోసం, ఒక వర్గానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు అడిషనల్ కలెక్టర్ నగేష్. అంతేకాదు లంచం డబ్బులు ఇవ్వడం కోసం ఏకంగా అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాడు సదరు ఉన్నతాధికారి.
చెక్ తో పాటు, ప్రాపర్టీ అగ్రిమెంట్, ఆడియో క్లిప్ లతో సహా నగేష్ దొరికిపోవడం ప్రస్తుతం కలకలంగా మారింది. ఒక కోటి 12 లక్షల నగదు తో పాటుగా, కోటి రూపాయల ప్రాపర్టీ కూడా నగేష్ రాయించుకున్న ట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్లుగా సమాచారం.

మెదక్ అడిషనల్ కలెక్టర్ హోదాలో అవినీతి అధికారి .. కొనసాగుతున్న తనిఖీలు
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అవినీతి విషయంలో రంగంలోకి దిగిన అధికారులు మాచవరంలోని నగేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 12 చోట్ల రైడ్స్ చేస్తున్న ఏసిబి అధికారులు నగేష్ అక్రమాస్తుల చిట్టా వెలికి తీసే పనిలో పడ్డారు.
ఒక ఉన్నతమైన పదవిలో పని చేస్తున్న నగేష్ ఇంత భారీ ఎత్తున లంచం తీసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిగా ఉండి ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అవినీతి అడిషనల్ కలెక్టర్ పై తెలంగాణలో చర్చ
కింది స్థాయి ఉద్యోగులను అవినీతికి పాల్పడకుండా సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన ఉన్నతోద్యోగులే అవినీతికి పాల్పడుతున్న తీరు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వంపై ఉందని టాక్ వినిపిస్తుంది.
మొన్న కీసర తహసీల్దార్ మాత్రమే కాదు ఇంకా పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడుతున్న తిమింగలాలు కూడా ఉన్నారని ఈ ఘటన ద్వారా తెలుస్తుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications