మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా కానిస్టేబుల్‌కు కూడా దిక్కులేదు.. హత్య చేసి, కాల్చేసిన ఉన్మాది.. వాడు కూడా కానిస్టేబులే..!

|
Google Oneindia TeluguNews

సంగారెడ్డి : మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు మరో కానిస్టేబుల్. సదాశివపేట మండలం కోనాపూర్ లో వెలుగుచూసిన ఈ ఘటన జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. హత్నూర పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ప్రకాశ్ కంది మండల కేంద్రానికి చెందినవాడు కాగా.. రామచంద్రాపురం పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మందారిక మేకవనంపల్లికి చెందినవారు. అయితే వీరిద్దరు గతంలో సంగారెడ్డి పీఎస్ లో పనిచేసే క్రమంలో ప్రేమికులుగా మారారు.

ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో డ్యూటీలు చేస్తున్నప్పటికీ తమ ప్రేమను కొనసాగించారు. ఆ నేపథ్యంలో తరచుగా కలుసుకునేవారు. అదే క్రమంలో సోమవారం (29.04.2019) నాడు కూడా డ్యూటీలు అయిపోయాక వీరిద్దరు కలుసుకుని బయటకు వెళ్లారు. అయితే మందారిక ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి రామచంద్రాపురం పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అక్కడి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తులో భాగంగా ప్రకాశ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. మందారికను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

woman constable murdered by other constable in sangareddy

<strong>మరోసారి పంజా విసిరిన నక్సల్స్.. 27 వాహనాలకు నిప్పు</strong>మరోసారి పంజా విసిరిన నక్సల్స్.. 27 వాహనాలకు నిప్పు

తన కారులోనే ఆమెను తీసుకెళ్లి కోనాపూర్ శివారులో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు అంగీకరించాడు ప్రకాశ్. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య ఇటీవల వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అదలావుంటే మందారిక వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం సహించలేక ప్రకాశ్ హత్యకు పాల్పడ్డాడనేది మరో వాదనగా వినిపిస్తోంది.

English summary
Woman Constable Murdered in Sangareddy District by other constable. Ramachandrapuram lady constable mandarika and hatnura constable prakash fell in love while they were in sangareddy PS. In marriage issue, they were quarrel recently. At last the prakash murdered mandarika on monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X