మహిళా కానిస్టేబుల్కు కూడా దిక్కులేదు.. హత్య చేసి, కాల్చేసిన ఉన్మాది.. వాడు కూడా కానిస్టేబులే..!
సంగారెడ్డి : మహిళా కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేశాడు మరో కానిస్టేబుల్. సదాశివపేట మండలం కోనాపూర్ లో వెలుగుచూసిన ఈ ఘటన జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. హత్నూర పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ప్రకాశ్ కంది మండల కేంద్రానికి చెందినవాడు కాగా.. రామచంద్రాపురం పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మందారిక మేకవనంపల్లికి చెందినవారు. అయితే వీరిద్దరు గతంలో సంగారెడ్డి పీఎస్ లో పనిచేసే క్రమంలో ప్రేమికులుగా మారారు.
ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో డ్యూటీలు చేస్తున్నప్పటికీ తమ ప్రేమను కొనసాగించారు. ఆ నేపథ్యంలో తరచుగా కలుసుకునేవారు. అదే క్రమంలో సోమవారం (29.04.2019) నాడు కూడా డ్యూటీలు అయిపోయాక వీరిద్దరు కలుసుకుని బయటకు వెళ్లారు. అయితే మందారిక ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి రామచంద్రాపురం పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో అక్కడి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తులో భాగంగా ప్రకాశ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. మందారికను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

తన కారులోనే ఆమెను తీసుకెళ్లి కోనాపూర్ శివారులో హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు అంగీకరించాడు ప్రకాశ్. పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య ఇటీవల వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అదలావుంటే మందారిక వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం సహించలేక ప్రకాశ్ హత్యకు పాల్పడ్డాడనేది మరో వాదనగా వినిపిస్తోంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications