ఏ పార్టీలో ఉన్నా.. నా గొంతుక నాదే: తేల్చేసిన మంత్రి ధర్మాన
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతష్ఠాత్మకంగా భావిస్తోన్న శ్రీకాకుళం జిల్లా భావనపాడు సీ పోర్ట్ నిర్మాణానికి భూములను ఇచ్చిన రైతులకు నష్ట పరిహారం అందుతోంది. మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మత్స్య సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పరిహారాన్ని చెల్లించారు. చెక్కులను పంపిణీ చేశారు.

ఒక్కో ఎకరానికి పాతిక లక్షలు..
ఒక్కో ఎకరానికి పాతిక లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించారు మంత్రులు. భవిష్యత్ లో రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఓ భారీ ప్రాజెక్టుకు భూమిని ఇచ్చిన ఘనత జిల్లా రైతులకు దక్కుతుందని అన్నారు. అనేక వనరులు ఉన్నప్పటికీ.. శ్రీకాకుళం జిల్లా ప్రజల జీవన ప్రమాణాల విషయంలో వెనుకబడే ఉందని మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఆ ఆవేదన తనకు ఎప్పుడూ ఉంటుదని వ్యాఖ్యానించారు.
ఏ పార్టీలో ఉన్నా..
జిల్లా స్థితిగతులు, ప్రజల జీవన ప్రమాణాలు, అభివృద్ధి.. వంటి విషయాలపై ఏ పార్టీలో ఉన్నా గానీ తన గొంతుక వినిపిస్తూనే ఉంటుందని ధర్మాన ప్రసాద రావు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు తాను నమ్మిన అంశాలపైనే మాట్లాడుతూ వస్తోన్నానని, దీన్నే కొనసాగిస్తాననీ పేర్కొన్నారాయన. ఇప్పుడు వైసీపీ సారథ్యంలోని తమ ప్రభుత్వం శ్రీకాకుళం మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా అనేక నిర్ణయాలను తీసుకుంటోందని, వాటిని అమలు చేస్తోందనీ అన్నారు.

రూ.3 వేల కోట్లతో..
జిల్లాలో 3,000 కోట్ల రూపాయలతో వ్యయంతో తమ ప్రభుత్వం చేపట్టిన భావనపాడు పోర్ట్ నిర్మాణం.. జిల్లా అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. దీని వల్ల పలు పరిశ్రమలు జిల్లాకు వస్తాయని, ఈ ప్రాంతం రూపు రేఖలన్నీ మారిపోతాయని ధర్మాన ప్రసాద రావు చెప్పారు. పోర్టు కారణంగా వచ్చే అనుబంధ పరిశ్రమల వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయని అన్నారు. దీనికి అనుగుణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని, ఎక్కడా రాజీ పడొద్దని అన్నారు.

కేంద్ర మంత్రి గానీ, ఎంపీ గానీ ఏం చేశారు..
గతంలో ఈ ప్రాంతం నుంచి కేంద్రమంత్రిగా పని చేసిన నాయకుడు గానీ, ఇప్పుడున్న ఎంపీ గానీ జిల్లాకు ఏం చేశారో వివరించాలని ధర్మాన ప్రసాద రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలను రాష్ట్రానికి కేటాయిస్తే అందులో ఒక్కటి కూడా శ్రీకాకుళం జిల్లాకు దక్కలేదని చెప్పారు. చంద్రబాబుకు ఈ జిల్లా అంటే ప్రేమ లేదని, నిర్లక్ష్యం మాత్రమే ఉందని ధ్వజమెత్తారు. అమరావతి పేరు చెప్పుకొని చంద్రబాబు వర్గీయులు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారని మండిపడ్డారు.

అచ్చెన్నాయుడు.. రామ్మోహన్ నాయుడు చెప్పగలరా?
చంద్రబాబు అన్ని విధాలుగా శ్రీకాకుళం జిల్లాకు ద్రోహం చేశారని ధర్మాన ఆరోపించారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా నిర్మించకుండా, పైసా ఖర్చు పెట్టకుండా తానే అన్నీ చేసినట్లు చెప్పుకొంటోన్న అబద్ధాలకోరు చంద్రబాబేనని విమర్శించారు. ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు జిల్లాకు ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు ధర్మాన. వెనుకబడిన జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications