టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు (ఫోటోలు)
: తెలంగాణ శాసనసభలో పది మంది టీటీడీపీ శాసనసభ్యులను వారంరోజుల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీపీ భగ్గుమంది. ప్రభుత్వ నియంతృత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, నేడు తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
నిరసన కార్యక్రమాల ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకువస్తామని టీటీడీపీ నేతలు తెలిపారు. గురువారం మధ్యాహ్నాం సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ జరిగింది.
ఎమ్మెల్యేలను మార్షల్స్ సభ నుంచి ఏకంగా బయట వరకూ తీసుకువెళ్లి వదిలిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రదర్శనగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు వెళ్లారు. వారు విగ్రహం వద్దకు వెళ్లకుండా ముందే గేటుకు తాళాలు వేశారు.
కొంతసేపు అక్కడే నిలబడి నినాదాలు చేసిన టీడీపీ సభ్యులు అసెంబ్లీ బయట రోడ్డు పేవ్మెంట్ మీద సరిగ్గా గాంధీ విగ్రహం ముందు కింద కూర్చుని ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
అసెంబ్లీ బయట రోడ్డు పేవ్మెంట్ మీద సరిగ్గా గాంధీ విగ్రహం ముందు కింద కూర్చుని ధర్నా చేస్తున్న టీటీడీపీ ఎమ్మెల్యేలు.

టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
అసెంబ్లీ బయట రోడ్డు పేవ్మెంట్ మీద సరిగ్గా గాంధీ విగ్రహం ముందు కింద కూర్చుని ధర్నా చేస్తున్న టీటీడీపీ ఎమ్మెల్యేలు.

టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
ఈ క్రమంలో పోలీసులతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు రవీంద్రభారతి కూడలి వద్దకు చేరి అక్కడ రోడ్డుపై బైఠాయించారు.
టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
అసెంబ్లీలో హిట్లర్ పరిపాలిస్తున్నారని, ఎంపీ కవితకు సంబంధించిన వివరాలు బయటపెడతామనే భయంతోనే తమను సస్పెండ్ చేశారని ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు.

టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
అనంతరం ఎమ్మెల్యేలను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. తమ సస్పెన్షన్పై శుక్రవారం గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.

టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
ధర్నా చేసిన టీటీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి పాతబస్తీలోని షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్కు తరలిస్తున్న దృశ్యం.

టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
ధర్నా చేసిన టీటీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి పాతబస్తీలోని షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్కు తరలిస్తున్న దృశ్యం.

టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
ధర్నా చేసిన టీటీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి పాతబస్తీలోని షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్కు తరలిస్తున్న దృశ్యం.

టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
ధర్నా చేసిన టీటీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి పాతబస్తీలోని షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్కు తరలిస్తున్న దృశ్యం.

టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేసి పాతబస్తీలోని షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్కు తరలిస్తున్న దృశ్యం.

టీటీడీపీ ఎమ్మెల్యేల ధర్నా... అరెస్టు
ధర్నా చేసిన టీటీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి పాతబస్తీలోని షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్కు తరలిస్తున్న దృశ్యం.
ఆ తర్వాత ఎమ్మెల్యేలు రవీంద్రభారతి కూడలి వద్దకు చేరి అక్కడ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పాతబస్తీలోని షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్కు తరలించారు. అసెంబ్లీలో హిట్లర్ పరిపాలిస్తున్నారని, ఎంపీ కవితకు సంబంధించిన వివరాలు బయటపెడతామనే భయంతోనే తమను సస్పెండ్ చేశారని ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు.
అనంతరం ఎమ్మెల్యేలను సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. తమ సస్పెన్షన్పై శుక్రవారం గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం వ్వవహరించిన తీరు సరిగా లేదని టీటీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అంతేకాక సభలో తమ గొంతు నొక్కేందుకే సస్పెన్షన్ల వేటును అధికార పక్షం ప్రయోగించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ సభ్యులు సభా నియమాలను పాటించడం లేదని, స్పీకర్ మాట కూడా వారు వినడం లేదని టీటీడీపీ నేతలు ఆరోపించారు.












Click it and Unblock the Notifications