Free Bus: మహిళలకు శుభవార్త.. వారి కోసం కొత్తగా 1325 బస్సులు..!
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తోంది. దీంతో మహిళలు భారీగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. పెరుగుతోన్న రద్దీకి అనుగుణంగా టీజీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జూన్ నాటికి 1325 కొత్త బస్సులను దశలవారీగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ 1325 బస్సుల్లో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్ ప్రెస్, 75 డీలక్స్, 138 లహరి, రాజధాని బస్సులున్నట్లు తెలుస్తోంది. ఈ 1325 బస్సుల్లో ఆర్టీసీ ఇప్పటికే కొన్నింటిని అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరో 100 బస్సులను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించిన 100 బస్సుల్లో 90 ఎక్స్ ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఇవి మహాలక్ష్మి-ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఉపయోగించనున్నారు.

శ్రీశైలం ఘాట్ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా ఆర్టీసీ తీసుకరాబోతోంది. 11 మీటర్ల పొడువుగల ఈ ఏసీ బస్సుల్లో.. 36 సీట్ల సామర్థ్యం ఉంటుందని అధికారులు తెలిపారు. శ్రీశైలానికి వెళ్లే భక్తులు సంస్థ అధికారిక వెబ్ సైట్ wwww.tsrtconline.in ద్వారా సీట్లను ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ మార్గ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ తో పాటు టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 90 బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయ్యొచ్చు. అయితే అవసరం ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణం చేయాలని చెబుతున్నారు. అనవసరంగా ప్రయాణం చేస్తే మిగతా వారికి ఇబ్బంది కలుగుతుందని పేర్కొంటున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications