ఒక్క బాలికపై ఆరుగురు యువకులు... రమ్మని మెసేజ్ పంపి గ్యాంగ్ రేప్
ఊరి చివర ఉన్న ఆలయానికి రమ్యని ఓ బాలికకు మెసేజ్ పంపిన ఓ యువకుడు ఆమె అక్కడికి రాగానే తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
దండేపల్లి: టీనేజి బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దండేపల్లి ఎస్సై సంజీవ్ కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
లక్ష్మీకాంతపూర్ కు చెందిన బాలిక(17)కు అదే గ్రామానికి చెందిన లక్షణ్ గత నెల 12న గ్రామ సమీపంలోని ఆలయం వద్దకు రావాలంటూ మెసేజ్ పంపాడు. దీంతో ఆమె ఆలయం వద్దకు వెళ్లింది.
అప్పటికే అక్కడ లక్షణ్ తోపాటు అతడి మిత్రులు ఐదుగురు ఉన్నారు. బాలిక వచ్చీరావడంతోనే బలవంతంగా వారు ఆమెను సమీపంలోని చేనులోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని చెప్పి బెదిరించి పంపించేశారు.

భయపడిన బాలిక ఆ అఘాయిత్యం గురించి ఎవరికీ చెప్పలేదు. అయితే ఆమె వాలకం చూసిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో జరిగినదంతా వారికి చెప్పేసింది. వారు వెంటనే దండేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు ఆమెపై సామూహిక అత్యచారానికి ఒడిగట్టిన లక్ష్మణ్, అతడి ఐదుగురు మిత్రులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉండగా వారికోసం గాలిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications