తెలంగాణలోనూ కరోనా కల్లోలం: 60 వేలకు చేరిన పాజిటివ్ కేసులు, 500 దాటిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 1764 కేసులు రాగా.. బుధవారం ఆ సంఖ్య మరింత పెరిగింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 18 వేల 263 మందికి పరీక్షలు చేశారు. 1811 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో వైరస్ వచ్చిన మొత్తం సంఖ్య 60 వేల 717 మందికి చేరింది.
MLA wife: 16 ఏళ్లు పిల్లలు లేరు, ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వార్డు పక్కనే కాన్పు, తల్లి, బిడ్డ, సీఎం
వీరిలో ప్రస్తుతం 15 వేల 640 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ తగ్గడంతో 44 వేల 572 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో వైరస్ సోకి 13 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 505కి చేరింది.
Recommended Video
జీహెచ్ఎంసీలో 521 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మంగళవారం 509, సోమవారం 531 కేసులు నమోదయ్యాయి. ఇటు మేడ్చల్ మల్కాజిగిరిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 151 కేసులు నమోదైనట్టు బులెటిన్లో పేర్కొన్నది. నల్గొండలో 61, మహబూబ్ నగర్లో 41 కేసులు వచ్చాయి. కరోనా వైరస్ కేసులు 60 వేల మార్క్ దాటగా.. మృతుల సంఖ్య 500 దాటింది.