ఇద్దరు టెన్త్ విద్యార్ధినుల ఆత్మహత్య, ఎందుకంటే?
హైదరాబాద్: హైదరాబాద్ సరూర్నగర్లో టిఎన్ఆర్ అపార్ట్మెంట్ లోని ఎనిమిదో అంతస్థు నుండి ఇద్దరు పదో తరగతి విద్యార్థినులు గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పదో తరగతి విద్యార్థినులు భార్గవి పటేల్, శ్రావణిలు అక్కడికక్కడే చనిపోయారు.
ఓ ప్రైవేట్ స్కూల్లో వీరిద్దరూ చదువుతున్నారు. అయితే కొంత కాలంగా వీరద్దరూ కలిసి చదువుకొంటున్నారు. గురువారం సాయంత్రం పూట ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీరిద్దరూ కూడ ఎనిమిదో అంతస్థు నుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి ఆత్మహత్యకు కారణాలు ఏమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారా , ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.












Click it and Unblock the Notifications