20 మంది ప్రగతి భవన్ సెక్యూరిటీకి కరోనా పాజిటివ్: నివాసం శానిటైజ్, ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్

విశ్వనగరి భాగ్యనగరంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం 998 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. అయితే ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. గత వారం రోజుల నుంచి విధులు నిర్వహిస్తున్న 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. వీంతా ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బంది అని అధికారులు తెలిపారు. కానీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రావడం చర్చకు దారితీసింది.

20 pragathi bhavan staff got coronavirus positive..

Recommended Video

    Petrol Diesel Price Hike : గాంధీ భవన్‌‌ ను ముట్టడించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు!!

    20 మందికి వైరస్ సోకిందని తెలిసి అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రగతి భవన్‌ను శానిటైజ్ చేశారు. అయితే ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ లేరు. ఆయన తన ఫామ్ హౌస్ ఎర్రవెల్లిలోనే ఉంటున్నారు. సీఎం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రగతి భవన్ మొత్తం శానిటైజ్ చేశారు. మరోవైపు గ్రేటర్ పరిధిలో కేసులు పెరగడంతో లాక్ డౌన్ విధించాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. కానీ లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం కాదు అని భావించి.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించింది. లేదంటే ఈపాటికే లాక్ డౌన్‌పై నిర్ణయం వెలువడేది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+