Telangana Covid cases : తెలంగాణలో కొత్తగా 427 కరోనా పాజిటివ్ కేసులు.. మరో ఇద్దరు మృతి
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు. మరో 1843 రిపోర్టులు రావాల్సి ఉంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,716కి చేరింది.ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 3,838కి చేరింది. తాజాగా మరో 609 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 6,40,065కి చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 7,812 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 4, భద్రాద్రి కొత్తగూడెం 6, జీహెచ్ఎంసీ 68, జగిత్యాల 16, జనగామ 5, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 2, కామారెడ్డి 2, కరీంనగర్ 43, ఖమ్మం 23, మహబూబ్నగర్ 5, కొమురంభీం ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 6, మంచిర్యాల 15, మెదక్ 3, మేడ్చల్ మల్కాజిగిరి 28, ములుగు 4, నాగర్ కర్నూల్ 4, నల్గగొండ 26, నారాయణపేట 2, నిజామాబాద్ 6, పెద్దపల్లి 22, రాజన్న సిరిసిల్ల 15, రంగారెడ్డి 21, సిద్దిపేట 13, సంగారెడ్డి 3, సూర్యాపేట 14, వికారాబాద్ 1, వనపర్తి 4, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ 41, యాదాద్రి భువనగిరిలో 7 చొప్పున కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే... గడిచిన 24గంటల్లో 40,120 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,17,826కు చేరింది. మరో 42,295 మంది కోలుకున్నారు.దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,13,02,345 మంది కోలుకున్నారు.
Recommended Video
మరణాల విషయానికొస్తే... గడిచిన 24గంటల్లో మరో 585 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,30,254కు పెరిగింది. ప్రస్తుతం 3,85,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 57,31,574 వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్పటివరకూ మొత్తం 52,95,82,956 వ్యాక్సిన్ డోసులు వేశారు.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది.దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇటీవలే ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 30వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ అవకాశం ఉందన్నారు.