శుభవార్త.. ఇళ్ళు లేనివారికి 5 లక్షలు ఇచ్చేది అప్పుడే !
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరోమారు శుభవార్త చెప్పింది. ఇల్లు లేని నిరుపేదలకు త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని ఇందిరమ్మ ఇళ్ల పథకం పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత రాష్ట్రంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ పథకంలో ఎవరికి ప్రాధాన్యతనిస్తుంది
, ఎప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తారు అనే అంశాల పైన రాష్ట్రంలో చర్చ జరుగుతుంది.
ఇందిరమ్మ ఇళ్ళ పథకంపై మంత్రి క్లారిటీ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళ పథకంపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే సొంతగా స్థలం ఉండి ఇల్లు లేదో వారికి తొలి దశలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇక రెండవ దశలో స్థలం కూడా లేనివారిని గుర్తించి వారికి స్థలం కేటాయించడంతోపాటుగా ఇళ్ల మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.

గ్రామ సభల ద్వారా లబ్దిదారుల ఎంపిక
ఇక రాష్ట్రంలో నవంబర్ 6వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తింపు ప్రారంభమవుతుందని దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని కూడా రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇక గ్రామాలలో 15 నుంచి 20 తేదీల మధ్య గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని గుర్తించి జాబితాలు ఖరారు చేస్తామని వెల్లడించారు. మొత్తం 15 రోజుల్లోనే గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.
వారికి ఇందిరమ్మ ఇళ్ళు లేనట్టే
ఇక రాష్ట్రంలో ఇళ్లను మహిళల పేరుతోనే మంజూరు చేస్తామని లబ్ధిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. కనీసం 400 చదరపు అడుగులు తగ్గకుండా ఇల్లు నిర్మాణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు పొందారో వారికి ఈసారి కేటాయింపులు ఉండబోవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
అలా ఉంటేనే ఈ పథకానికి అర్హులు
ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఎలాంటి డిజైన్లు నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు . 400 సదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఇంటి నిర్మాణం చేపట్టాలని అలా ఉంటేనే గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తుందని ఆయన వెల్లడించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఇచ్చే అంశం పైన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications