హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా అప్‌డేట్... తెలంగాణలో కొత్తగా 536 కేసులు.. మరో ముగ్గురు మృతి...

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కొత్తగా 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 676 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (డిసెంబర్ 16) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,79,135కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1502కి చేరింది. ప్రస్తుతం 7,183 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 5041 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,78,450కి చేరింది.

గడిచిన 24గంటల్లో మొత్తం 52,057 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 62,57,745కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,68,128 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 95.2 శాతం ఉండగా తెలంగాణలో 96.88శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 172, రంగారెడ్డి జిల్లాలో 41 కరోనా కేసులు నమోదయ్యాయి.

536 new coronavirus cases and 3 deaths reported from telangana

దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 26,382 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99,32,548కి చేరింది. మరో 387 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1,44,096కి చేరగా ప్రస్తుతం 3,32,002 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.

English summary
536 new coronavirus cases were reported in Telangana from last 24 hours,more 3 patients were died. Total cases number reached to 2,79,135 and total death toll reached to 1502.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X