కరోనా అప్డేట్... తెలంగాణలో కొత్తగా 536 కేసులు.. మరో ముగ్గురు మృతి...
తెలంగాణలో కొత్తగా 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 676 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (డిసెంబర్ 16) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,79,135కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1502కి చేరింది. ప్రస్తుతం 7,183 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 5041 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,78,450కి చేరింది.
సర్కారు దవాఖానాల్లో పెరిగిన కాన్పులు.
— Eatala Rajender (@Eatala_Rajender) December 16, 2020
👉 తెలంగాణ లోని ప్రభుత్వ దవాఖానాల్లో పెరిగిన కాన్పులు.
👉2015 - 16 సంత్సరంలో పోలిస్తే 20 శాతం పెరుగుదల.
👉దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ సరికొత్త రికార్డు.#KCRkit pic.twitter.com/bwzxrwiG9N
గడిచిన 24గంటల్లో మొత్తం 52,057 శాంపిల్స్ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 62,57,745కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,68,128 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 95.2 శాతం ఉండగా తెలంగాణలో 96.88శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 172, రంగారెడ్డి జిల్లాలో 41 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 26,382 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 99,32,548కి చేరింది. మరో 387 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 1,44,096కి చేరగా ప్రస్తుతం 3,32,002 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.