తెలంగాణలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటు: కేసీఆర్కు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ
హైదరాబాద్: దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్ కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి సింధియాను విందుకు ఆహ్వానించిన కేసీఆర్
తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన కేంద్రమంత్రి సింధియా శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి గౌరవార్ధం సీఎం ఆయనను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. అనంతరం జరిగిన భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎకనామిక్ గ్రోత్ సెంటర్ గా అభివృద్ధి చెందడంతోపాటు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీగా రూపుదిద్దుకుంటున్నందున, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి, వివిధ దేశాలకు విమానయాన సౌకర్యాలను మరింతగా మెరుగు పరచాలని కేంద్రమంత్రిని కోరారు. బిజినెస్ హబ్ గా, ఐటీ హబ్ గా, హెల్త్ హబ్ గా, టూరిజం హబ్ గా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం ఇంకా విస్తరిస్తుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, పలు అంతర్జాతీయ నగరాల నుండి ప్రయాణికులు వస్తున్నందున సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, యూఎస్ లకు హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్స్ కనెక్టివిటీని పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రమంత్రి సింధియా దృష్టికి తీసుకొచ్చారు.
తెలంగాణలో ఆరు విమానాశ్రయాల ఏర్పాటుకు హామీ
తెలంగాణ
రాష్ట్రం
నుండి
ప్రతిపాదనలో
ఉన్న
వివిధ
పట్టణాల్లోని
6
ఎయిర్
పోర్టుల
అభివృద్ధి
ఆపరేషన్స్
కోసం
వెంటనే
చర్యలు
తీసుకొని
కేంద్ర
విమానయాన
మంత్రిత్వ
శాఖ
నుంచి
తగిన
సహకారం
అందించాలని
ఈ
సందర్భంగా
కేంద్రమంత్రిని
కోరారు.
హైదరాబాద్
ఎయిర్
పోర్టుకు
మెట్రో
కనెక్టివిటీ
ఏర్పాటు
చేసేలా
చర్యలు
తీసుకోవాలని
కోరారు.
దీనిపై
స్పందించిన
కేంద్రమంత్రి
శ్రీ
సింధియా
దేశంలో
దినదినాభివృద్ధి
చెందుతున్న
హైదరాబాద్
అంతర్జాతీయ
విమానాశ్రయ
అభివృద్ధికి
సంపూర్ణ
సహకారం
అందిస్తామని
హామీ
ఇచ్చారు.
భవిష్యత్
లో
హైదరాబాద్
ఎయిర్
పోర్టు
ఇంకా
అభివృద్ధి
కావాల్సిన
అవసరం
ఉన్నదని
కేంద్రమంత్రి
అభిప్రాయం
వ్యక్తం
చేశారు.
తెలంగాణ
రాష్ట్రం
నుండి
ప్రతిపాదనలో
ఉన్న
6
ఎయిర్
పోర్టుల్లో
ఒకటైన
వరంగల్
(మామునూరు)
ఎయిర్
పోర్టు
అథారిటీ
లాండ్
(ఏఐ)
ఏటీఆర్
ఆపరేషన్స్
త్వరలో
ప్రారంభించడానికి
చర్యలు
తీసుకుంటామని
కేంద్రమంత్రి
తెలిపారు.
నిజామాబాద్
జిల్లా
(జక్రాన్
పల్లి)లో
ఎయిర్
పోర్టుకు
సంబంధించిన
టెక్నికల్
క్లియరెన్స్
ఇస్తామని
పేర్కొన్నారు.
ఆదిలాబాద్
లో
ఎయిర్
పోర్టును
ఎయిర్
ఫోర్స్
ద్వారా
ఏర్పాటు
చేసే
విషయాన్ని
తమ
మంత్రిత్వ
శాఖ
ద్వారా
పర్యవేక్షిస్తామని
తెలిపారు.
పెద్దపల్లి
(బసంత్
నగర్),
కొత్తగూడెం,
మహబూబ్
నగర్
(దేవరకద్ర)
ఎయిర్
పోర్టుల్లో
చిన్న
విమానాలు
వచ్చిపోయేలా
చేయడానికి
పున:
పరిశీలన
చేసి,
తగు
చర్యలు
తీసుకుంటామని
సీఎంకు
కేంద్రమంత్రి
సింధియా
హామీ
ఇచ్చారు.
ఈ
కార్యక్రమంలో
మంత్రులు
కేటీఆర్,
వేముల
ప్రశాంత్
రెడ్డి,
మహమూద్
అలీ,
ప్రభుత్వ
ముఖ్య
సలహాదారు
రాజీవ్
శర్మ,
సీఎస్
సోమేశ్
కుమార్,
సీఎం
ప్రిన్సిపల్
సెక్రటరీ
నర్సింగరావు,
సెక్రటరీలు
స్మితా
సభర్వాల్,
రాజశేఖర్
రెడ్డి,
కేంద్ర
పౌర
విమానయాన
శాఖ
సెక్రటరీ
ప్రదీప్
కరోలా,
జాయింట్
సెక్రటరీ
దూబే,
స్పెషల్
చీఫ్
సెక్రటరీ
(ఫైనాన్స్)
రామకృష్ణా
రావు,
రవాణా
శాఖ
ప్రిన్సిపల్
సెక్రటరీ
సునిల్
శర్మ,
జీఎంఆర్
గ్రూప్
చైర్మన్
గ్రంధి
మల్లికార్జునరావు
తదితరులు
పాల్గొన్నారు.
దేశంలోనే తెలంగాణలో తొలిసారి డ్రోన్ ద్వారా టీకాలు, మెడిసిన్ డెలివరీ..
దేశంలో తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఆకాశమార్గన ఔషధాల పంపిణీ ప్రయోగానికి తెలంగాణ వేదికైంది. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును వికారాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాల్గొన్నారు. రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి డ్రోన్లను వినియోగించనున్నారు. డ్రోన్ లో ఔషధాల బాక్సులను పెట్టి జ్యోతిరాదిత్య సింధియా ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. మూడు డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలు పంపించారు. ఔషధాలను వికారాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో డ్రోన్లు డెలివరీ చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సింధియా మాట్లాడుతూ.. డ్రోన్ టెక్నాలజీ గురించి చాలా విన్నామని, ఇదొక టెక్నాలజీ మాత్రమే కాదని, విప్లవాత్మకమైన చర్యగా ఆయన అభివర్ణించారు. డ్రోన్లో కొత్త ఆవిష్కరణ చూస్తున్నట్లు, మానవ మనుగడకు డ్రోన్లు ఈ విధంగా ఉపయోగపడడం సంతోషకరమన్నారు. మందులను డ్రోన్ ల ద్వారా పంపిణీ చేయడం, ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం వేదిక అయ్యిందన్నారు. డ్రోన్ సేవలు ప్రధాన మంత్రి మోడీ కల అని, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో.. కొన్ని కఠినతరమైన చట్టాలను సులభతరం చేశారన్నారు. ఒక డబ్బాలో మెడిసిన్ను తీసుకొని వెళ్లడం, ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రతి గ్రామానికి వైద్యం అందుబాటులోకి తీసుకరావాలని, మందులు, వ్యాక్సిన్లు అందచేయాలనే ఈ ప్రయత్నమన్నారు. వ్యాక్సిన్లు దూర ప్రాంతాలకు అందచేయాలంటే ఇక ఇబ్బంది లేకుండా.. డ్రోన్ల ద్వారా చేసుకోవచ్చన్నారు కేంద్రమంత్రి. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్... సబ్ కా ప్రయాస్ అనే నినాదాలతో ముందుకు వెళుదామన్నారు జ్యోతిరాదిత్య సింధియా.
తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సామాన్యుడికి ఉపయోగం లేని సాంకేతికత వ్యర్థమన్నారు. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తుంటారని చెప్పారు. రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆధునాతన టెక్నాలజీతో మందులు సరఫరా చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేస్తామన్నారు. ఆరోగ్య రంగంలోనే గాక, అనేక రంగాల్లో డ్రోన్లు వాడొచ్చన్నారు. మహిళల భద్రత కోసం ఉపయోగించవచ్చని, మైనింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల ద్వారా కట్టడి చేయొచ్చన్నారు. కాగా, దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లు , మందులు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కోసం బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ డ్రోన్లను వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా మందులు, టీకాలను డ్రోన్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్.. తొలిదశలో 11వ తేదీ శనివారం నుంచి సెప్టెంబర్ 11 వరకు వికారాబాద్ జిల్లాలో డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.