Virat Kohli: గోడపై 60 అడుగుల విరాట్ కోహ్లీ పెయింటింగ్.. అభిమానం చాటుకున్న ఖమ్మం యువకుడు..
ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ లో క్రికెట్ ను ఒక మతంగా కొలుస్తారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు దాదాపు అందరికీ క్రికెట్ గురించి తెలుసుంటుంది. క్రికెట్ పై అభిమానమే కాదు.. క్రికెట్ ఆడే అటగాళ్లపై కూడా విపరీతమైన అభిమానం ఉంటుంది. ఒక్కప్పుడు సచిన్ అంటే చాలా మంది ఇష్టపడే వారు. ఆ తర్వాత ఆ స్థాయిలో విరాట్ కోహ్లీ అంటే ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు.
కోహ్లీపై అభిమానంతో కొందరు తమ ఒంటిపై కోహ్లీ చిత్రాన్ని టాట్ గా వేసుకున్నారు. తాజాగా ఖమ్మంకు చెందిన విరాట్ కోహ్లీ వీర అభిమాని కోహ్లీ భారీ పెయింటింగ్ ను గోడపై వేయించారు. కార్తికేయ అనే యువకుడు గోడపై 60 అడుగుల విరాట్ కోహ్లీ పెయింటింగ్ వేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెయింటింగ్ పోస్టులకు చాలా మంది కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ తమ దేవుడంటూ కామెంట్ చేస్తున్నారు.

గత ఏడాది విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ లో 50 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటుచేశారు. విరాట్ కోహ్లీ క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 108 టెస్ట్ మ్యాచులు ఆడి 8,416 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 274 వన్డేల్లో విరాట్ కోహ్లీ 12,898 పరుగులు చేశాడు. ఇందులో 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Good morning viratinas ♥️♥️
— VK 18 fan (@Deba3264) March 26, 2023
60 feet painting of Virat Kohli in telegana#ViratKohli pic.twitter.com/Mq2OqcpDjE
115 టీట్వింటీలు ఆడిన కోహ్లీ 4,008 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ ల్లో విరాట్ కోహ్లీ అత్యధిక వ్యక్తిగత స్కోర్ 254 పరుగులు కాగా, వన్డేల్లో 183, టీట్వింటీల్లో 122 పరుగులు చేశాడు. వన్డేల్లో, టీట్వింటీల్లో నాలుగ చొప్పున వికెట్లు తీశాడు. సచిన్ తర్వాత భారత్ తరుఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications