7 రోజుల చిన్నారి కరోనాతో కన్నుమూత, వారం క్రితం నీలోఫర్లో డెలివరీ, కంటైన్మెంట్ జోన్గా...
ఆ తల్లిదండ్రులకు వైరస్ లక్షణాలు లేవు, వైరస్ లక్షణాలు ఉన్న ప్రాంతానికి కూడా వెళ్లలేదు. ఆ గర్భవతి వారం క్రితం జన్మనిచ్చింది. కానీ చిన్నారి మాత్రం కలతగా ఉండటంతో.. ఎందుకైనా మంచిదని.. సీజేరియన్ చేసిన నీలోఫర్ తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది.. చిన్నారి చనిపోయింది. పరీక్షలు చేస్తే.. 7 రోజుల పసిగుడ్డుకు కరోనా వైరస్ ఉంది అనే జీర్ణించుకోలేని నిజం వెలుగుచూసింది.

వారం క్రితం డెలివరీ
హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ రంగారెడ్డి నగర్కి చెందిన జంట.. గత పదేళ్లుగా జీ ప్లస్ 1లో ఉంటున్నారు. వారం క్రితం గర్భవతి నీలోఫర్ ఆస్పత్రిలో డెలివరీ అయ్యారు. తర్వాత తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండటంతో ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఆ చిన్నారికి కరోనా వైరస్ సోకింది. కానీ తల్లిదండ్రులు బాగానే ఉన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లేకున్నా.. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్ స్పష్టంచేసింది. కరోనా వైరస్ పరీక్షలు తక్కువ చేస్తున్నారని హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. కానీ పరీక్షలు నిర్వహణ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.

కంటైన్మెంట్ జోన్
చిన్నారి చనిపోయాక.. తల్లిదండ్రులకు వైరస్ పరీక్ష చేశారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్కు కూడా టెస్టులు చేశారు. వారు ఉంటోన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. జీ ప్లస్ వన్ ఇంటి నుంచి 14 రోజుల వరకు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు స్పష్టంచేశారు. ఆ ఇంటికి స్టాంప్ కూడా వేశారు.
Recommended Video

ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ సోకి 7 రోజుల పాప చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వైరస్ సోకి చనిపోయిన పిన్న వయస్సు గల చిన్నారిగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 2 వేల మార్క్కి చేరింది. మంగళవారం నాటికి 1991 కేసులు ఉండగా.. 650 మందికి చికిత్స అందిస్తున్నారు. 1284 మందిని డిశ్చార్జ్ చేశారు. 57 మంది చనిపోయారు. మంగళవారం ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు రికార్డవడం ఆందోళన కలిగించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications