Loksabha Election 2024: ఉదయం 9 గంటలకు 9.48 శాతం పోలింగ్ నమోదు..
తెలంగాణకు సంబంధించి లోక్ సభ ఎన్నికల్లో తొలి రెండు గంటల్లో 9.48 శాతం పోలింగ్ నమోదయింది. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 13.2శాతం, జహీరాబాద్ 12.8 శాతం, నల్గొండ 12.8 శాతం పోలింగ్ నమోదైంది. హీరో నరేశ్ నానక్రామ్గూడాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చేవెళ్లలోని గొల్లపల్లిలో ఓటు హక్కును బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓటు వేశారు. రాష్ట్రంలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు అధికారులు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక చీకటి గదుల్లో పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి కురిసిన వర్షం, గాలులకు విద్యుత్ నిలిచిపోయిందని అధికారులు వివరించారు.
కుమురంభీం జిల్లా కాగజ్నగర్ మండలం జగన్నాథపూర్లో గ్రామస్థులు ఊరికి రోడ్డు వేయాలని లేకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు . రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్రంలో 17 ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. అటు ఏపీలో 9.51 శాతం ఓటింగ్ నమోదయింది.

-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications