మంత్రి ఈటెల సమక్షంలో రైతు ఆత్మహత్యయత్నం, కారణమిదే
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి ఈటెల రాజేందర్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో మంత్రి ఈటెల రాజేందర్ ఎదుట ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
మండలంలోని పొత్తూరు గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించేందుకుగాను మంత్రి రాజేందర్ ఆదివారం నాడు వచ్చారు. ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
అయితే పోలీసులు ఆయనను అడ్డుకొన్నారు. సాగునీరు అందక వరిపంట ఎండిపోయిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన సూచించారు.
అన్ని రకాలుగా రైతులను ఆదుకొంటామని ఈటెల రైతులకు హమీ ఇచ్చారు. ఎండిన పంటలను సర్వే చేయించి తగిన పరిహరం ఇస్తామని మంత్రి హమీ ఇచ్చారు.
Comments
English summary
A farmer suicide attempt infront of minister Etela Rajendar on suday.he has suicide attempt for crop damage.This incident happend in rajanna sircilla district.
Story first published: Sunday, April 2, 2017, 16:15 [IST]