యువతిని ఎత్తుకెళ్లి ఆటో డ్రైవర్ల గ్యాంగ్రేప్
రంగారెడ్డి: జిల్లాలోని పోడూరు మండలం మన్నెగూడ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి బస్సు కోసం వేచి చూస్తున్న ఓ యువతిపై నలుగురు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మన్నెగూడకు చెందిన దానయ్య తన ఆటోలో ఆ యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చుతానని నమ్మబలికి, అనంతరం తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే యువతి కేకలు విన్న గ్రామస్తులు .. పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రౌడీ షీటర్ దారుణ హత్య
హైదరాబాద్: అసద్ అనే రౌడీ షీటర్ను అతని ప్రత్యర్థులు హత్య చేశారు. బహదూర్పురా రెండు ముఠాల మధ్య చోటు చేసుకన్న విభేదాలే కారణంగా తెలుస్తోంది.