మద్యం మత్తులో అత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు...!
మద్యం మత్తులో అత్తను గోడ్డలితో నరికి చంపాడు ఓ అల్లుడు. అనంతరం భార్యవెంట కూడ పడి తరిమికోట్టాడు.ఈ దారుణ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది. భూపాల్పల్లి జిల్లాలోని రేగొండ మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన సుజాత అనే యువతితో కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది.తాగుడుకు బానిసైన ప్రభాకర్ వేధింపులు భరించలేని భార్య సుజాత తన పుట్టింటికి వెళ్లింది.
మంగళవారం రాత్రి భార్యను తీసుకురావడానికి అత్తింటికి మద్యం మత్తులోనే వెళ్లాడు. అయితే భర్త మద్యం మత్తులో రావడంతో అతనితో వెళ్లేందుకు భార్య సుజాత అంగీకరించలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తీవ్ర ఘర్షన జరిగింది. ఎంత చెప్పినా వినకపోవడంతో తీవ్ర ఆవేశానికి గురి అయ్యాడు ప్రభాకర్...అక్కడే ఉన్న గొడ్డలి తీసుకుని భార్యపై దాడి చేశాడు. కూతురిపైకి అల్లుడు గొడ్డలి ఎత్తడం గమనించిన సుజాత తల్లి లక్ష్మీ... అల్లుడికి అడ్డు వెళ్లింది. ఇంకేముంది భార్యమీద కోపాన్ని అత్తమీద చూపించాడు ప్రభాకర్ . భార్యను కొడుతుంటే అడ్డు వచ్చిన అత్తపై మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా గొడ్డలితో అత్త మెడపై నరికాడు. కాగా తీవ్రగాయాల పాలైన లక్ష్మీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
అయినా ప్రభాకర్ చలించకుండా భార్యవెంబడి పడ్డాడు. దీంతో భార్య సుజాత అరుస్తూ రోడ్డుపైకి వచ్చింది. ఆమే అరుపులు విన్న స్థానికులు ప్రభాకర్ ను అడ్డుకుని ఆమేను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా మద్యం మత్తులో భార్యను గొడ్డలితో కొట్టడంతో ఆమే పరిస్థితి కూడ విషమంగా ఉందని తెలిపారు.