వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశలను చిదిమేసిన విద్యుత్ ఘాతం: నవ వధువు మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కొత్త ఆశలు, ఎన్నో ఊసులతో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆ యువతిని విద్యుత్ ఘాతం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన శేరిలింగంపల్లి తారానగర్‌లో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... నారాయణఖేడ్‌ సుకిల్‌ధర్‌ గ్రామానికి చెందిన పండరీనాథ్‌ కుమార్తె భానుప్రియ(21) అలియాస్‌ సర్యాబాయికి తారానగర్‌కు చెందిన శ్రీనివాస్‌కు 45రోజుల క్రితం వివాహమైంది. శ్రీనివాస్‌ నల్లగండ్ల కూరగాయల మార్కెట్‌లో పని చేస్తుంటాడు.

A new bride died with Electric shock

కాగా, భానుప్రియ గురువారం ఉదయం ఇంటిలో నీళ్లు పట్టుకుందాని నల్లా తిప్పగా విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే కుటుంబీకులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పాత భవనం కావడంతో విద్యుత్తు తీగలు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి నల్లాకు కరెంటు సరఫరా అయి చనిపోయి ఉంటుందని కుటుంబీకులు తెలిపారు. నవ వధువు మృతి చెందడంతో అటు పుట్టింటో, ఇటు అత్తారింట్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

English summary
A new bride died with Electric shock in Rangareddy district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X