హనీమూన్ వీసా కోసం వచ్చి.. ప్రాణాలొదిలిన నవ వరుడు
హైదరాబాద్: నగరంలోని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. హనీమూన్ వీసా కోసం వచ్చిన ఓ నవ వరుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా అమరావతికి చెందిన శ్రీకాంత్ రెడ్డి(31)కి నవంబర్, 2015లో వివాహం జరిగింది. అతను తన భార్య, భావ అశ్విత్ రెడ్డి, చెల్లెలు అక్షయతో కలిసి హనీమూన్ ట్రిప్ వెళ్లేందుకు వీసా కోసం ఫిబ్రవరి 16న హైదరాబాద్ నగరానికి వచ్చారు.

పేట్ బషీరాబాద్ సమీపంలోని వీఎస్ఎస్ నందదీప్ అపార్ట్మెంట్లో బస చేశారు. గురువారం ఉదయం అపార్ట్మెంట్ నుంచి కిందకు దిగుతున్న శ్రీకాంత్ రెడ్డి ప్రమాదవశాత్తు కాలుజారి 5వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు.
తీవ్రగాయాలు కావడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
థాయ్ లాండ్ లో రష్మిక, విజయ్ హనీమూన్.. ఫోటో వైరల్..! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications