‘రావు’ కథ సుఖాంతం: వ్యాపారి కిడ్నాప్(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ ప్రభాకర్ కథనం ప్రకారం... కర్మన్ ఘాట్ గ్రీన్ పార్కు కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరంగం(48) మూడు రోజుల క్రితం నగరంలోని బంజారాహిల్స్కు వెళ్లి అదృశ్యమయ్యాడు.
అయితే సాయంత్రం ఆరుగంటల సమయంలో తన తమ్ముడి కుమారుడు వెంకటరమేష్కు ఫోన్ చేసి తాను బంజారాహిల్స్లో ఉన్నానని ఇంటికి వస్తానని వెంకటరంగం చెప్పారు. మళ్లీ కొద్ది సేపటికే ఫోన్ చేసి తనను గుర్తుతెలియని వ్యక్తులు ట్యాక్సీలో తీసుకెళ్తున్నారని చెప్పారు. తర్వాత అతని ఫోన్ పనిచేయలేదు. కుమారుడు హరిప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
అదృశ్యమైన వ్యాపారి కుటుంబం సురక్షితం
కుటుంబసభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి అదృశ్యమైన వ్యాపారి సుబ్బారావు ఆచూకీ లభ్యమైంది. హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎన్జీవో కాలనీకి చెందిన సుబ్బారావు ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరుడికి లేఖ పెట్టి, అదృశ్యమైన సంగతి తెలిసిందే.
కాగా, సుబ్బారావు కుటుంబసభ్యులు అంతా కలిసి నాగపూర్ వెళ్తుండగా ఆదిలాబాద్లో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు, వదిలిపెట్టారు. దీంతో వాళ్ల కథా సుఖాంతమైంది. తాము ఆత్మహత్య చేసుకుందామనే వెళ్లామని... అయితే తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్లు సుబ్బారావు మీడియాకు తెలిపారు.
కిడ్నాపైన రియల్ ఎస్టేట్ వ్యాపారి
నగరంలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ ప్రభాకర్ కథనం ప్రకారం... కర్మన్ ఘాట్ గ్రీన్ పార్కు కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరంగం(48) మూడు రోజుల క్రితం నగరంలోని బంజారాహిల్స్కు వెళ్లి అదృశ్యమయ్యాడు.
సుబ్బారావు కథ సుఖాంతం
కుటుంబసభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి అదృశ్యమైన వ్యాపారి సుబ్బారావు ఆచూకీ లభ్యమైంది.
సుబ్బారావు కథ సుఖాంతం
హైదరాబాద్ వనస్థలిపురంలోని ఎన్జీవో కాలనీకి చెందిన సుబ్బారావు ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరుడికి లేఖ పెట్టి, అదృశ్యమైన సంగతి తెలిసిందే.
సుబ్బారావు కథ సుఖాంతం
కాగా, సుబ్బారావు కుటుంబసభ్యులు అంతా కలిసి నాగపూర్ వెళ్తుండగా ఆదిలాబాద్లో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు, వదిలిపెట్టారు. దీంతో వాళ్ల కథా సుఖాంతమైంది.