డ్రగ్ రాకెట్ కేసులో షాకింగ్: నాసాలో పని చేసిన సైంటిస్ట్ అరెస్ట్
డ్రగ్ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో నాసాలో శాస్త్రవేత్తగా పని చేసిన అనీష్ అనే సైంటిస్ట్ కూడా ఉండటం గమనార్హం.
హైదరాబాద్: డ్రగ్ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో నాసాలో శాస్త్రవేత్తగా పని చేసిన అనీష్ అనే సైంటిస్ట్ కూడా ఉండటం గమనార్హం.
అనీష్ నుంచి ఎక్సైజ్ శాఖ పెద్ద మొత్తంలో డ్రగ్స్, కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. రుతుల్ అగర్వాల్తో కలిసి అనీష్ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
కాగా, హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోన్న మాదకద్రవ్యాల వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ బుధవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 10 మందికి నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications