వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థినికి ఉపాధ్యాయుడి ప్రేమలేఖలు: హెచ్చరించినా వినకపోవడంతో వేటు

|
Google Oneindia TeluguNews

నల్గొండ: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి, మంచి మార్గంలో నడిపించాల్సిన ఓ ఉపాధ్యాయుడు వెకిలి వేషాలు వేసి పాఠశాల నుంచి సస్పెండయ్యాడు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. అడ్డగూడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడేళ్లుగా ఆర్డ్స్ అండ్ క్రాఫ్స్ టీచర్‌గా పనిచేస్తున్న గూడెపు పరమేశ్ అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి తనను ప్రేమించాలంటూ ప్రేమ లేఖలు రాశాడు. గతంలో ప్రేమ లేఖలు రాసిన సందర్భంలో పరమేశ్‌ను ప్రధానోపాధ్యాయుడు మందలించాడు.

యినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. గత 15 రోజుల్లో రెండుసార్లు విద్యార్థినికి ప్రేమలేఖలు రాశాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు ఉపాధ్యాయుడిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదుచేశారు.

A teacher allegedly harassed a girl student

డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ విచారణ జరిపారు. అనంతరం ప్రేమ లేఖలు రాసిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంఈఓ అంజయ్య, ప్రధానోపాధ్యాయుడు అనంతరెడ్డి తెలిపారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పారు.

సాగర్ కెనాల్‌లో పడి యువకుడి మృతి

నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం కుత్‌బుషాపురం బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీకాంత్ బీటెక్ చదువుతూ... నేరేడుచర్లలో ఓ పెట్రోల్‌బంక్‌లో పార్ట్‌ టైమ్ జాబ్ చేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున బైక్‌పై వెళుతూ అదుపుతప్పి సాగర్ కెనాల్‌లో పడిపోవడంతో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A teacher has been suspended for harassing a girl student at School in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X