హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం మత్తు: భవనం పైనుంచి పడి టెక్కీ మృతి

|
Google Oneindia TeluguNews

A techie man dies falling from top of the building
హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిజాంపేటలో నివాసం ఉంటున్న బుగ్గపాటి కళ్యాణ్(33) సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇదే కంపెనీలో కాచిగూడ, చప్పల్ బజార్‌లోని పుల్లారెడ్డి రెసిడెన్సీ ఐదో అంతస్తులో నివాసముంటున్న శ్రీకాంత్, లక్ష్మీగణేష్, రాజ్ కుమార్ కూడా పని చేస్తున్నారు.

ఈ నలుగురు శనివారం రాత్రి శ్రీకాంత్ నివాసంలో పార్టీ చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న కళ్యాణ్ కిందకు దిగుతుండగా జారి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మరో టెక్కీ మృతి

నగరంలోని మదీన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందింది. తనూశ్రీ, అనిత అనే ఇద్దరు యువతులు నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం చార్మినార్ సమీపంలోని మదీనా చౌరస్తా వద్ద గల షాదాబ్ హోటల్ భోజనం చేసిన అనంతరం ఇద్దరూ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.

ఆ సమయంలోనే మరో ద్విచక్ర వాహనం ఎదురుగా రావడంతో వాహనం నడుపుతున్న తనూశ్రీ సడెన్ బ్రేక్ వేసింది. దీంతో వాహనం అదుపుతప్పి పక్కనే వెళుతున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో తనూశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. అనితకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. తనూశ్రీ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

English summary
A drunken techie died, allegedly fell from top of the building in Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X