ఏ కష్టమొచ్చిందో..: ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య
శనివారం తెల్లవారుజామున ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్: మల్కాజ్గిరి రైల్వేస్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఎంత కష్టమొచ్చిందో గానీ ఆ తల్లి ఇంత దారుణమైన నిర్ణయానికి వచ్చింది.
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. పుప్పాలగూడకు చెందిన నక్కా గౌరమ్మ(35), సాయి తేజ(4), నాగరాజు(5) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

చిన్నారులిద్దరు మణికొండ విశ్వభారతి పాఠశాలలో చదువుతున్నారు. పిల్లలిద్దరూ స్కూల్ దుస్తుల్లో ఉండటంతో శుక్రవారమే వారి తల్లి పాఠశాల నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. కాగా, తల్లితోపాటు ఇద్దరు పిల్లలు చనిపోవడంపై పలు అనుమానాలకు కూడా తావిస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications