హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ ఎందుకు పిలిచారో తెలియదు కానీ, దటీజ్ కేటీఆర్: మెగా ఫ్యామిలీ హీరో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన మెట్రో రైలు ప్రారంభం కావడంతో పలువురు నెటిజన్లు తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ట్విట్టర్ అకౌంట్ ద్వారా సందేశాలు పంపించారు.

Recommended Video

GES 2017 : Ivanka Trump Security Details Leaked

మెట్రో నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దినందుకు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన సేవలను ప్రశంసిస్తూ హీరోలు, నెటిజన్లు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నటుడు సాయి ధరమ్ తేజ్ మంత్రి కేటీఆర్‌ను ఆకాశానికెత్తారు.

బాబు, కేసీఆర్ ప్రభుత్వాలపై రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, గొప్ప అవకాశమని మంచు లక్ష్మీబాబు, కేసీఆర్ ప్రభుత్వాలపై రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, గొప్ప అవకాశమని మంచు లక్ష్మీ

కేటీఆర్ డైనమిక్ లీడర్ అని చెప్పడానికి ఇది చాలు

కేటీఆర్ డైనమిక్ లీడర్ అని చెప్పడానికి ఇది చాలు

మెట్రో ప్రారంభంలో రిబ్బన్ కట్ చేయడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు కానీ, ఆయన వచ్చాక రిబ్బన్ కట్ చేయడం చూస్తుంటే కేటీఆర్ డైనమిక్ లీడర్ అని చెప్పడానికి అది చాలు అని అయన అన్నారు.

బూర నర్సయ్య గౌడ్ స్పందించారు

బూర నర్సయ్య గౌడ్ స్పందించారు

టిఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా స్పందించారు. మరో మైలురాయిని అధిగమించామని, మంత్రి కేటీఆర్ చొరవతో మెట్రో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశామని అందులో పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాపారవేత్తగా కురిపించారని, ఎక్కడా రాజకీయ నాయకుడిగా కనిపించలేదని, యువత ఐకాన్‌గా నిలిచారని మరొకరు ట్వీట్ చేశారు.

మొదటి రోజు చాలామంది ప్రయాణించే అవకాశం

మొదటి రోజు చాలామంది ప్రయాణించే అవకాశం

కాగా, బుధవారం ఉదయం నుంచి మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఉదయం ఆరు గంటలకు ఒక రైలు నాగోలు స్టేషన్‌లో, మరో రైలు మియాపూర్‌ స్టేషన్‌లో బయల్దేరాయి. మెట్రోలో తొలిరోజు ప్రయాణించేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు. మొదటి రోజు సుమారు లక్షమంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేశారు.

ప్రతి పావు గంటకు ఓ రైలు

ప్రతి పావు గంటకు ఓ రైలు

ప్రతి పావుగంటకో రైలు చొప్పున మొత్తం 18 రైళ్లు తిరుగుతాయి.
మెట్రో కార్డుల విక్రయం మొదలుపెట్టిన తర్వాత మూడు రోజుల్లోనే 12 వేలకు పైగా అమ్మడయ్యాయి. తొలిరోజు మెట్రో రైలులో లక్ష మంది ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా మొదటి రోజే రైళ్ల సంఖ్యను పెంచాల్సి రావొచ్చు.

గంటలోపు ఆ చివరి నుంచి ఈ చివరకు

గంటలోపు ఆ చివరి నుంచి ఈ చివరకు

మియాపూర్‌-నాగోలు 27.6 కిలోమీటర్ల మార్గంలో మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. వీటి మధ్య ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే ప్రస్తుతం గంటా 50 నిమిషాలు పడుతోంది. అదే మెట్రోలోనైతే గంటలోపు చేరుకోవచ్చు.

English summary
Actor Sai Dharam Tej praised Telangana IT Minister KT Rama Rao.అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన మెట్రో రైలు ప్రారంభం కావడంతో పలువురు నెటిజన్లు తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ట్విట్టర్ అకౌంట్ ద్వారా సందేశాలు పంపించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X