ఐఏఎస్ అధికారిణితో భర్త వివాహం: కంటతడి పెట్టిన నటి పూజిత
హైదరాబాద్: విజయ గోపాల్ తనతో మూడేళ్ల పాటు కాపురం చేసి ప్రస్తుతం తాను ఎవరో తెలియదని చెబుతున్నాడని, కొడుకును చూడాలని నటి పూజిత కంటతడి పెట్టారు. విజయగోపాల్ తన భర్తే అంటూ ఆమె అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు.
పోలీస్ స్టేషన్ వెళ్లిన ప్రతిసారి ఆధారాలు తీసుకు రావాలని చెబుతున్నారే తప్ప కేసు నమోదు చేయడం లేదని ఆమె వాపోయారు. తన భర్త మరో వివాహం చేసుకున్నాడనే పూజిత ఫిర్యాదు పైన దర్యాఫ్తు చేస్తున్నామని, నిపుణుల సలహా తీసుకుంటున్నామని, త్వరలో కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

కాగా, తన భర్త విజయగోపాల్, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి నుంచి తనకు ప్రాణహానీ ఉందని సినీ నటి పూజిత మరోసారి మంగళవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె మంగళవారం నాడు ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
విడాకులు ఇవ్వకుండానే తన భర్త రేఖారాణిని వివాహం చేసుకున్నారని ఆమె ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తన కుమారుడికి, తనకు న్యాయం జరిగేలా చూడాలని పూజిత కోరుతున్నారు.
నటి పూజిత తన భర్త విజయ గోపాల్ పైన ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విజయ గోపాల్ తనను పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత తనకు విడాకులు ఇవ్వకుండానే రేఖారాణిని పెళ్లాడారని ఆమె వారం రోజుల క్రితం ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పోలీసులను ఆశ్రయించారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications