Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ జాబితాలో కొత్త ట్విస్టులు - ముఖ్య నేతల సీట్ల మార్పు..!!

తెలంగాణ ఎన్నికల రాజకీయం లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రచారం..మేనిఫెస్టోలో బీఆర్ఎస్ దూకుడు మీద ఉంది. కాంగ్రెస్ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్దుల ప్రకటనకు సిద్దమైంది. ఇదే సమయంలో పార్టీలో చేరిన సీనియర్లకు సీట్లపైన ఇచ్చిన హామీల్లో మార్పులు జరుగుతున్నాయి. దీంతో, పార్టీ అగ్రనేత రాహుల్ నుంచి పిలుపు రావటంతో మాజీ మంత్రి తుమ్మల..పొంగులేటి ఢిల్లీ వెళ్లారు. ఇద్దరి సీట్లు మారినట్లు సమాచారం.

మారుతున్న లెక్కలు : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితాలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీపీఐ, సీపీఎంతో పొత్తుల్లో చర్చల్లో భాగంగా ఖమ్మం జిల్లా నేతల సీట్లలో మార్పులు చేస్తున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేటాయించిన సీట్లు,..ఇప్పుడు పొత్తుల కారణంగా మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లా నేతలు పాంగులేటి..తుమ్మలతో పార్టీ ముఖ్య నాయకత్వం చర్చించింది.

After meeting with Rahul Gandhi Tummala and Ponguleti seats change in Khammam Dist as reports

మాజీ మంత్రి తుమ్మలకు కేసీ వేణుగోపాల్ పిలుపుతో... ఢిల్లీలో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు. పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా రాహుల్‌తో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరిన రోజు తుమ్మలకు సమయం ఇవ్వలేక పోవడంతో... అధిష్టానం ఆయనను ఢిల్లీకి పిలిచింది. సుమారు అరగంట పాటు రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ అయ్యారు.

వామపక్షాలతో పొత్తు : ఈ సమయంలోనే ఖమ్మం జిల్లాలో సీట్ల మార్పు గురించి వేణుగోపాల్ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. తుమ్మల వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటు పైన తొలుత హామీ పొందారు. అదే విధంగా పొంగులేటికి కొత్తగూడెం సీట్ల పైన హామీ దక్కింది. ఇప్పుడు పొత్తుల లెక్కల్లో భాగంగా కొత్తగూడెం, మంచిర్యాల సీట్లు సీపీఐకు కేటాయించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు.

అదే సమయంలో సీపీఎం పట్టుబడుతున్న మధిర, భద్రాచలం స్థానాల్లో సిట్టింగ్ లను కాదని ఇవ్వలేమని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో, తాజా మార్పులతో పాలేరు సీటును పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఖరారు అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తుమ్మల ను ఈ సారి మంత్రి పువ్వాడ అజయ్ పైన ఖమ్మం నుంచి బరిలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.

After meeting with Rahul Gandhi Tummala and Ponguleti seats change in Khammam Dist as reports

ఖమ్మం జిల్లాలో సీట్ల మార్పు : సీపీఐ పొత్తులో భాగంగా కాంగ్రెస్ నుంచి బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, వైరా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ, రెండు స్థానాలకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న మైత్రి కారణంగా తెలంగాణలోనూ పొత్తు కొనసాగింపు దిశగా నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. సీపీఎం ఖమ్మం జిల్లాలోని సీట్ల పైన పట్టుబడుతోంది.

దీంతో, రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో తుది నిర్ణయం జరగాల్సి ఉందని తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే ఏ సీటు ఖరారు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఈ నెల 18న పార్టీ అభ్యర్దుల జాబితా విడుదలకు పార్టీ కసరత్తు చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+