ముంబై ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్: మహారాష్ట్రలో పలుచోట్ల గెలుపు
ప్రతిష్టాత్మకమైన బహృన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బోణీ కొట్టింది. మజ్లిస్ అంటే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది.
ముంబై/హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన బహృన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బోణీ కొట్టింది. మజ్లిస్ అంటే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. కానీ మహారాష్ట్రలో గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.
ఇప్పుడు బీఎంసీ ఎన్నికల్లోను బోణీ కొట్టింది. 227 వార్డులు ఉన్న బీఎంసీలో 59 చోట్ల మజ్లిస్ పోటీ చేసింది. ముంబైలోనే కాదు.. షోలాపూర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోను గెలిచింది.
ముంబైలో శివసేన-బీజేపీ హవా: ముందే రిజైన్ చేసిన కాంగ్రెస్ చీఫ్
ముంబై సివిక్ పోల్స్లో రెండు స్థానాల్లో గెలిచింది. మజ్లిస్ బీఎంసీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది.
పది స్థానాలు గెలుస్తామని మజ్లిస్ భావించింది. బాంద్రా, ఖురేష్ నగర్, బైకుల్లా, గోవండి, మంకుర్డ్, డోంగ్రీ, సేవ్రీ తదితర ప్రాంతాల్లో గెలుస్తామనుకుంది. అయితే, నాన్ ముస్లీం ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది. షోలాపూర్లో ఐదు సీట్లు గెలిచింది.