అలెర్ట్: 78వేల రాయితీ ఇస్తున్నా పట్టించుకోరా.. అయితే మీకే నష్టం!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో విద్యుత్ అవసరాలను తీర్చడం కోసం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపైన సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన ఈ పథకంలో తెలంగాణ రాష్ట్రం బాగా వెనుకబడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 19,985 ఇళ్లపై మాత్రమే సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు MNRE తాజా గణాంకాలు చెబుతున్నాయి.
తెలంగాణాలో నత్తనడకన ఆ కేంద్ర పథకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 60 వేల పైన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయగా, అత్యధికంగా గుజరాత్లో 4.55 లక్షల ఇళ్లపై, కేరళ రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ పథకం అమలు నత్త నడకన సాగుతుందని తాజా గణాంకాలతో తెలుస్తోంది.

సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే బోలెడు లాభాలు
ఈ పథకం ద్వారా కరెంట్ బిల్లులు ఆదా అవుతాయని, అలాగే సోలార్ ప్యానల్స్ ద్వారా అదనపు విద్యుత్ ను ప్రొడ్యూస్ చేస్తే వాటిని తిరిగి డిస్కం లు కొనుగోలు చేస్తాయని, అందుకు మనకు డబ్బులు కూడా ఇస్తాయని కేంద్రం చెబుతోంది. రెండు కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి లక్ష ఇరవై వేల రూపాయల ఖర్చు వస్తుంది.
మూడు కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ కు 78వేల రాయితీ
ఇందులో 60 వేల రూపాయలను ఇంటి యజమాని భరిస్తే మిగతా 60 వేల రూపాయల డబ్బులు రాయితీ లభిస్తుంది. ఇక మూడు కిలోవాట్ల విద్యుత్తు సోలార్ ప్యానల్స్ ఏర్పాటుతో మొత్తం 78 వేల రూపాయల రాయితీ పొందవచ్చు. రెండు కిలోవాట్ల సోలార్ ప్యానల్స్ ఏర్పాటుతో 250 యూనిట్లలోపు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ప్రచారం చేస్తే ఈ స్కీమ్ అమలుకు ఆస్కారం
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 1.35 కోట్ల సాధారణ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో ఒక కోటి పది లక్షల కనెక్షన్లు నెలకు 240 యూనిట్ల విద్యుత్ ను మాత్రమే వినియోగిస్తున్నాయి. అయితే ఇటువంటి వర్గాలను టార్గెట్ చేసి దీని పైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.
తెలంగాణా ప్రభుత్వంపైనే బాధ్యత అంతా
ఈ పథకాన్ని ప్రోత్సహిస్తే తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని నిధులు అందిస్తామని ఎం ఎన్ ఆర్ ఈ ఇప్పటికే ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రం పీఎం సూర్య ఘర్ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాన్ని పొంది, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications