భూతగాదా: రంగారెడ్డి కోర్టుకు అల్లు అర్జున్, రాజీ కుదుర్చుకున్నారు
హైదరాబాద్: టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానానికి హాజరయ్యారు. కుటుంబానికి సంబంధించి ఒక సివిల్ కేసు విషయంలో రాజీ కుదుర్చుకునే అంశంపై ఆయన ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.

2009లో నార్సింగిలోని భూ తగాదా విషయమై రాహుల్ అనే వ్యక్తి కేసు వేశాడు. ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ కోర్టుకు వచ్చారు. ఇవాళ కోర్టులో జరిగిన లోక్ అదాలత్లో ఈ భూమి విషయంలో ఇరు వర్గాలు రాజీకి వచ్చాయి.

రాజీ అనంతరం అల్లు అర్జున్ తిరిగి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆయనను చూసేందుకు కోర్టుకు వచ్చిన కక్షిదారులు, లాయర్లు ఉత్సుకత ప్రదర్శించారు. కాగా, సుమారు ఆరేళ్లుగా సాగుతున్న ఈ తగాదా విషయం కొలిక్కి వచ్చినట్లయింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications