అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ .. హోమ్ ఐసోలేషన్ లో స్టైలిష్ స్టార్ !!
చిత్ర పరిశ్రమలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. పలువురు స్టార్ హీరోలు,టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కరోనా మొదటి వేవ్ కంటే రెండవ వేవ్ ఉధృతంగా ఉన్న వేళ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ కరోనా బయటపడ్డారు. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి, ఫామ్ హౌస్ లో చికిత్స పొందుతున్న పరిస్థితి తెలిసిందే. ఇక తాజాగా అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
Recommended Video
అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి రాజకీయ ప్రముఖులు , సినీ ప్రముఖులను ఎవరిని వదలడం లేదు.ఇటీవల సినీ రంగానికి చెందిన పలువురు దిల్ రాజు, బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా ,తాజాగా అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన అల్లు అర్జున్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని,తాను హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లానని పేర్కొన్నారు.
తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలన్న అల్లు అర్జున్
ఇటీవలకాలంలో తనను కలిసిన వారు ఎవరైనా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంతో పాటుగా, సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలని సూచించారు. తన మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ తాను బాగానే ఉన్నానని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.ఇళ్లల్లోనే ఉండండి, సేఫ్ గా ఉండండి అంటూ అల్లుఅర్జున్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ మామయ్య పవన్ కళ్యాణ్ కు కరోనా సోకింది.
అంతకు ముందు పవన్ కళ్యాణ్ కు కరోనా .. కోలుకున్న పవన్ కళ్యాణ్
పవన్ వ్యక్తిగత సెక్యూరిటీ , అలాగే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న దిల్ రాజు, బండ్ల గణేష్ తదితరులు కరోనా పాజిటివ్ బారిన పడ్డారు .తిరుపతిలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేసి అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు . ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా ఆప్పుడు నెగిటివ్ వచ్చింది . మళ్ళీ అనారోగ్యంతో బాధ పడుతూ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స పొందారు . ఇక తాజాగా అల్లు అర్జున్ కు కరోనా సోకటంతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.