వాళ్ళను ఇరాన్ పంపించండి.. ప్రధాని మోదీకి యాంకర్ రష్మి షాకింగ్ రిక్వెస్ట్!
ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాలలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి పైన ఒత్తిడిని కలుగజేస్తుంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎక్కడకు తీసుకు వెళ్తాయో అన్న ఆందోళన ప్రతి దేశంలోనూ వ్యక్తమవుతుంది.
ప్రధానికి యాంకర్ రష్మి సంచలన విజ్ఞప్తి
కేవలం ఇరాన్ ఇజ్రాయిల్ మాత్రమే కాకుండా వీరి మధ్య కొనసాగుతున్న యుద్ధ ప్రభావం యూఏఈ, ఖతార్, బహ్రయిన్, దుబాయ్ తదితర దేశాల పైన కూడా కొనసాగుతుంది. దీంతో ఆయా దేశాలలో నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం పైన యాంకర్ రష్మి గౌతమ్ ప్రధాని నరేంద్ర మోడీకి సంచలన విజ్ఞప్తి చేశారు.

షాకింగ్ ట్వీట్ చేసిన రష్మీ గౌతమ్
ఆమె ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ రష్మి గౌతమ్ ఏం చెప్పారంటే మన దేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలను గౌరవించింది. కానీ రాడికల్ మనస్తత్వాన్ని మేము సహించం.. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాపించనివ్వం అని రష్మి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది.
వారిని ఇరాన్ పంపించేయండి.. మోదీకి విజ్ఞప్తి
అంతేకాదు రాడికల్ ఆలోచనలతో యుద్ధాన్ని సమర్థించే వాళ్ళని దయచేసి ఇరాన్ పంపాలని ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వాళ్లు ఇరాన్ వెళ్లి తమ సొంత ప్రజల కోసం పోరాడుకోవచ్చని రష్మి గౌతమ్ పేర్కొంది. మన దేశంలో ఇప్పటికే నిరక్షరాస్యత, పేదరికం, కుల సమస్యలు మొదలైన అంతర్గత సమస్యలు అనేకం ఉన్నాయని పేర్కొంది.
మతపిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని ఆవేదన
వీటికి తోడు ఇప్పుడు ఈ రాడికల్ మనస్తత్వం ఉన్న వాళ్ళ మతపిచ్చితో దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారని రష్మి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాడికల్ మనస్తత్వం ఉన్న దేశాలలో ఆడపిల్లలకు 9 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తున్నారని కానీ, తను ఒక స్వతంత్ర దేశంలో ఉంటున్నందుకు గర్వపడుతున్నానని రష్మీ పేర్కొంది.
పెళ్లిపై ఘాటుగా స్పందించిన రష్మీ
అయితే ఈ క్రమంలో కొందరు రష్మీ పెళ్లి గురించి మాట్లాడగా వారికి ఘాటుగా సమాధానం ఇచ్చింది. నేను పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉన్నా సరే నా దేశంలో పూర్తిగా గౌరవంతో, వ్యక్తితంతో బ్రతుకుతున్నాను అని రష్మీ పేర్కొంది. ఇక రష్మి చేసిన వ్యాఖ్యలపైన కొందరు సానుకూలంగా స్పందిస్తే, మరికొందరు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
-
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
చావు దెబ్బ: అబ్రహం లింకన్ పై ఇరాన్ క్షిపణి దాడి? -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్












Click it and Unblock the Notifications